టాలీవుడ్ ఇండస్ట్రీ లో నటుడిగా మంచి గుర్తింపును సంపాదించుకున్న వారిలో శ్రీ విష్ణు ఒకరు. తాజాగా ఈయన సింగిల్ అనే సినిమాలో హీరోగా నటించాడు. ఈ మూవీ ని గీత ఆర్ట్స్ బ్యానర్ పై ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ నిర్మించాడు. ఈ మూవీ ని మే 9 వ తేదీన విడుదల చేయనున్నారు. ఈ సినిమా విడుదల తేదీ దగ్గర పడడంతో ఈ మూవీ బృందం వారు ఈ సినిమాకు సంబంధించిన ప్రమోషన్లను ఇప్పటి నుండే మొదలు పెట్టారు. అందులో భాగంగా కొన్ని రోజుల క్రితమే ఈ సినిమా ట్రైలర్ను కూడా విడుదల చేశారు. ఇకపోతే తాజాగా ఈ మూవీ కి సంబంధించిన మరో క్రేజీ న్యూస్ బయటకు వచ్చింది.

అసలు విషయం లోకి వెళితే ... ఈ సినిమా యొక్క యూ ఎస్ ఏ హక్కులను ఓ రెండు ప్రముఖ సంస్థలు దక్కించుకున్నాయి. తాజాగా అందుకు సంబంధించిన అధికారిక ప్రకటన కూడా వెలువడింది. అసలు విషయం లోకి వెళితే ... ఈ సినిమా యొక్క యూ ఎస్ ఏ హక్కులను వి సినిమాస్ , రాధాకృష్ణ ఎంటర్టైన్మెంట్స్ సంస్థలు సంయుక్తంగా దక్కించుకున్నాయి. ఇకపోతే ఈ సినిమాను మే 9 వ తేదీన విడుదల చేయనుండగా ఈ మూవీ కి సంబంధించిన యు ఎస్ ఏ ప్రీమియర్స్ ను మే 8 వ తేదీనే ప్రదర్శించనున్నట్లు కూడా ఈ మూవీ బృందం వారు తాజాగా అధికారికంగా ప్రకటించారు.

శ్రీ విష్ణు ఆఖరుగా స్వాగ్ అనే మూవీ తో  ప్రేక్షకులను పలకరించాడు. ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర బోల్తా కొట్టిన ఈ సినిమాలోని శ్రీ విష్ణు నటనకు ప్రేక్షకుల నుండి , విమర్శకుల నుండి మంచి ప్రశంసలు దక్కాయి. మరి స్వాగ్ మూవీ తో పెద్ద స్థాయి విజయాన్ని అందుకోలేకపోయిన శ్రీ విష్ణు "సింగిల్" మూవీ తో ఏ స్థాయి విజయాన్ని అందుకుంటాడో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: