టాలీవుడ్ ఇండస్ట్రీలో ఉన్న క్రేజీ కాంబినేషన్లలో పవన్ త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ కూడా ఒకటి. ఈ కాంబినేషన్ లో తెరకెక్కిన జల్సా, అత్తారింటికి దారేది సినిమాలు అంచనాలకు మించి విజయం సాధించగా అజ్ఞాతవాసి సినిమా మాత్రం నిర్మాతలను ముంచేసింది. అయితే పవన్ అంటే త్రివిక్రమ్ కు త్రివిక్రమ్ అంటే పవన్ కు ఎంతో అభిమానం అనే సంగతి తెలిసిందే. పవన్ రాజకీయాల్లోకి వెళ్లడం త్రివిక్రమ్ శ్రీనివాస్ కు శాపమైందా అనే ప్రశ్నకు అవుననే సమాధానం వినిపిస్తోంది.
 
గుంటూరు కారం సినిమా తర్వాత త్రివిక్రమ్ సినిమాలేవీ రిలీజ్ కాలేదు. అజ్ఞాతవాసి ఫ్లాప్ తర్వాత కూడా కేవలం 10 నెలల్లో సినిమా పూర్తి చేసి విడుదల చేసి హిట్ సాధించిన ప్రతిభ త్రివిక్రమ్ శ్రీనివాస్ సొంతం అని చెప్పవచ్చు. పవన్ ప్రస్తుతం సినిమాల్లో బిజీగా ఉంటే త్రివిక్రమ్ పవన్ కాంబోలో కచ్చితంగా సినిమా తెరకెక్కేదని చెప్పవచ్చు. త్రివిక్రమ్ శ్రీనివాస్ కెరీర్ ప్లాన్స్ ఉంటాయో చూడాల్సి ఉంది.
 
స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో కెరీర్ పరంగా బిజీ కావాలని ఫ్యాన్స్ ఫీలవుతున్నారు. త్రివిక్రమ్ శ్రీనివాస్ నెక్స్ట్ లెవెల్ కాన్సెప్ట్ లను ఎంచుకుంటే ఈ డైరెక్టర్ ఖాతాలో మరిన్ని విజయాలు చేరడం పక్కా అని చెప్పవచ్చు. త్రివిక్రమ్ శ్రీనివాస్ రెమ్యునరేషన్ 30 కోట్ల రూపాయల రేంజ్ లో ఉందని సమాచారం అందుతోంది. బన్నీ త్రివిక్రమ్ కాంబో మూవీ అంతకంతకూ ఆలస్యం అవుతోంది.
 
బన్నీ ప్రస్తుతం అట్లీ ప్రాజెక్ట్ తో బిజీ కావడం వల్ల త్రివిక్రమ్ శ్రీనివాస్ సినిమా ఆలస్యం అవుతోందని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ ఇతర డైరెక్టర్లకు గట్టి పోటీ ఇచ్చే విధంగా ఎదగాల్సి ఉంది. త్రివిక్రమ్ శ్రీనివాస్ మీడియా ముందుకు వసే మాత్రమే ఎన్నో ప్రశ్నలకు సమాధానం దొరికే అవకాశం ఉంది. త్రివిక్రమ్ రేంజ్ అంతకంతకూ పెరిగితే ఫ్యాన్స్ సంతోషానికి అవధులు ఉండవు.
 


మరింత సమాచారం తెలుసుకోండి: