
అంతేకాదు, సెట్స్ నుండి ఏ చిన్న క్లిప్ కూడా బయటకు రాకుండా రాజమౌళి కఠినమైన భద్రతా చర్యలు తీసుకున్నారని సమాచారం. ఎందుకంటే, ఇప్పటివరకు వచ్చిన చిన్న లీక్ వీడియోలు, ఫోటోలు సినిమాపై ఊహాగానాలను పెంచేశాయి. రామోజీ ఫిలిం సిటీలో కాశీ సెట్ కనిపించడం వల్ల కథ కాశీ నుండి ప్రారంభమై అడవుల్లో ముగుస్తుందేమో అన్న అనుమానాలు కలుగుతున్నాయి.సినిమా కథపై వినిపిస్తున్న మరో టాక్ ఏమిటంటే – విలన్ గుప్త నిధుల కోసం మహేష్ బాబును అడవుల్లోకి పంపిస్తాడట. ఆ అడవుల్లో ఆయన ఎదుర్కొనే అడ్వెంచర్లు, థ్రిల్లింగ్ యాక్షన్ సీక్వెన్స్లతో సినిమా రక్తికట్టిస్తుందట. రాజమౌళి మార్క్ స్క్రీన్ప్లే, విజువల్స్, గ్రాండ్ ప్రొడక్షన్ వల్ల హాలీవుడ్ రేంజ్లో ఈ మూవీ ఉంటుందని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి.
ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ ప్రియాంక చోప్రా హీరోయిన్గా నటిస్తుండగా, మలయాళ స్టార్ పృథ్వీ రాజ్ సుకుమారన్ కీలక పాత్ర పోషిస్తున్నారు. భారీ బడ్జెట్తో, అంతర్జాతీయ స్థాయి టెక్నీషియన్స్తో రూపొందుతున్న ఈ చిత్రం తెలుగు, తమిళం, హిందీతో పాటు అనేక భాషల్లో విడుదల కానుంది.ఎస్ఎస్ఎంబి 29 కేవలం టాలీవుడ్కే కాదు, ఇండియన్ సినిమా ఇండస్ట్రీకి ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్గా మారింది. మహేష్ బాబు కెరీర్లోనే ఇది గేమ్ ఛేంజర్ అవుతుందన్న నమ్మకంతో అభిమానులు ఎదురు చూస్తున్నారు. విడుదలైన మొదటి గ్లింప్స్ నుంచే రికార్డులు బద్దలయ్యే అవకాశం ఉన్న ఈ మూవీ, పాన్ వరల్డ్ హైప్ను సాక్షాత్కారంగా చూపించనుంది.