
తమిళనాడులో అయితే ఇడ్లి కొట్టు బాగా రన్ అవుతుంది. ముందస్తు టికెట్లు సగటున గంటకు 1500–2000 అమ్ముడుపోతున్నాయి. అయితే తెలుగులో ప్రేక్షకులు నేటివిటీ సమస్య, కథారంగంలో కనెక్ట్ కావడం లేకపోవడంతో భారీ రెస్పాన్స్ రావడం లేదు. కథ అంతా కోత్తగా అనిపించలేదనని ప్రీ రిలీజ్ టాక్. పైగా ఒకే రోజు కాంతార చాప్టర్ 1 రిలీజ్ కావడంతో, ఆ ప్రాంతాల్లోని ప్రేక్షకుల సంఖ్య కూడా ప్రభావితం అవుతుంది. ధనుష్ స్వీయ దర్శకత్వంలో తీసిన ఈ మూవీ కమర్షియల్ ఫార్ములా నుంచి దూరంగా, క్లాస్ & ఎమోషనల్ డ్రామా వైపు వెళ్ళింది. పల్లెటూరు గ్రామీణ కుటుంబం, ఇడ్లిలు అమ్ముకునే సీన్, భావోద్వేగాలు, గ్రామీణ మట్టి వాసన, అనుబంధాలు ఇలా మొత్తం కాంటెంట్ పరంగా గట్టి నమ్మకం చూపిస్తుంది.
జీవి ప్రకాష్ కుమార్ సంగీతం సమకూర్చిన ఇడ్లి కొట్టులో ‘సాహో’ అరుణ్ విజయ్ విలన్గా, సత్యరాజ్, పార్తీబన్, షాలిని పాండే, అర్జున్ రెడ్డి ఫేమ్ హీరోయిన్లు ముఖ్య పాత్రల్లో నటించారు. మరోసారి పెర్ఫార్మెన్స్ డిమాండ్ చేసే పాత్రలో నిత్య మీనన్ హీరోయిన్గా నటించింది. మొత్తానికి, ఇడ్లి కొట్టు ఎమోషన్, పర్ఫార్మెన్స్, గ్రామీణ వాసన అన్నీ కలిపి పండగలా ఉంటుంది. ధనుష్ క్లాస్ కంటెంట్ను తెలుగు ప్రేక్షకులకు కూడా చూపించేందుకు ప్రయత్నిస్తున్నాడు. ఈసారి పెద్ద బజ్ లేకపోయినా, కథ, నటన, సంగీతం చూడాలనుకునే ప్రేక్షకులకు సినిమా మోస్ట్ ఎక్స్పెక్ట్ చేస్తోంది.