టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు – దర్శక ధీరుడు రాజమౌళి కాంబినేషన్‌లో రూపొందుతున్న ‘వారణాసి’ సినిమా గురించి ప్రేక్షకుల్లో ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో, ఇటీవల హైదరాబాద్‌లోని రామోజీ ఫిల్మ్ సిటీలో ఈ సినిమాకు సంబంధించిన టైటిల్ రివీల్ మరియు గ్లింప్స్ లాంచ్ ఈవెంట్‌ను అద్భుతంగా, అతి ప్రతిష్టాత్మకంగా నిర్వహించారు. భారీ స్టేజ్ డిజైన్, మహా పెద్ద డిజిటల్ స్క్రీన్, లేజర్ లైటింగ్, గ్రౌండ్ సెటప్—అన్ని బాగా కుదిరాయి. ఈ కార్యక్రమంలో సినిమా టైటిల్‌తో పాటు గ్లింప్స్‌ను కూడా విడుదల చేశారు. అవి విడుదలైన వెంటనే సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అయ్యాయి. మహేష్ బాబు లుక్, రాజమౌళి మార్క్ విజువల్స్ అందరినీ ఆకట్టుకున్నాయి.


ఈవెంట్ కోసం మూవీ యూనిట్ ఎన్నో రోజులుగా నిశ్చితంగా ప్లాన్ చేస్తూ, పగలు–రాత్రి తేడా లేకుండా కష్టపడి పనిచేసిందని రాజమౌళి స్వయంగా తెలిపారు. రామోజీ ఫిల్మ్ సిటీలో వందలాది టెక్నీషియన్లు, వేలాది లైటింగ్ యూనిట్ సభ్యులు, క్రేన్ ఆపరేటర్లు, స్టేజ్ ఆర్టిస్టులు కలిసి దీని కోసం కష్టపడ్డారట. ఇప్పుడు నెట్టింట్లో హాట్ టాపిక్ ఏమిటంటే—ఈ ఈవెంట్ ఖర్చు ఎంత అయ్యింది? ఇండస్ట్రీ వర్గాల అంచనాల ప్రకారం, ఈవెంట్ మొత్తం ఖర్చు రూ. 20 నుండి 26 కోట్ల మధ్య ఉండొచ్చని కొందరు చెబుతున్నారు. మరికొందరు మాత్రం అంత పెద్ద మొత్తం కాకపోయినా, కనీసం రూ.15 కోట్లకు పైగా ఖర్చు అయి ఉండొచ్చని భావిస్తున్నారు.



అత్యంత ఆసక్తికరమైన విషయం ఏమిటంటే— మహేశ్ బాబు ఎంట్రీ సీన్ కోసం మాత్రమే సుమారు రూ. 50 లక్షలు ఖర్చు చేశారట! స్మోక్ ఎఫెక్ట్స్, హై ప్రెసిషన్ లైటింగ్, స్పెషల్ రిగ్స్, మ్యూజిక్ సింక్రనైజేషన్—అన్నిటికి బాగా ఖర్చు చేశారట. అంతేకాకుండా, ఈవెంట్ జియో మరియు హాట్‌స్టార్ వంటి ఓటీటీ ప్లాట్‌ఫార్మ్‌ల్లో లైవ్ స్ట్రీమింగ్ చేయబడింది. లైవ్ రైట్స్ ద్వారా ఈవెంట్ ఆర్గనైజర్స్ కొన్ని కోట్ల రూపాయలు రాబట్టినట్లు టాక్. ఇంకా లైవ్ ప్రసారం జరుగుతున్న సమయంలో వచ్చిన యాడ్స్ ద్వారానే రూ.5 కోట్లకు పైగా ఆదాయం వచ్చి ఉండొచ్చని నెటిజన్లు అంచనా వేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: