బాలీవుడ్ నటులలో ఒకరైన సోనాలి బింద్రే గురించి ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు . తాజాగా ఈ భామ క్యాన్సర్ గురించి మాట్లాడుతూ చెప్పిన కొన్ని మాటలు ప్రజెంట్ సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారాయి . 2018లో మెటాస్టాటిక్ క్యాన్సర్ వచ్చి ఎన్నో బాధలు అనుభవించిన అనంతరం ధైర్యంగా పోరాడి బయటపడిన సోనాలి బింద్రే ఒక కార్యక్రమంలో తన అనుభూతిని పంచుకుంది . ప్రకృతి వైద్యం తన రికవరీ జర్నీలో సపోర్ట్ గా నిలిచిందని తెలిపింది. ప్రజెంట్ ఆ వ్యాఖ్యలు కొంతమందిని అగ్రహానికి గురి చేయడం జరిగింది . సోనాలి బింద్రే మాట్లాడుతూ.. " ప్రకృతి వైద్యం క్యాన్సర్ను తగ్గిస్తుంది అన్న దానికి ఎటువంటి శాస్త్రీయ ఆధారాలు లేవు " అంటూ ఆమె కామెంట్స్ చేసింది .


దీంతో ఈ విమర్శలు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వైరల్ అవుతున్నాయి . ఇక దీనివలన సోనాలి చేసిన మాటలపై అర్థం తప్పుగా తీసుకుంటున్నారు అనే భావన కలిగి వెంటనే వ్యాఖ్యలను క్లారిటీ వెల్లడించింది సోనాలి . తాను ఎప్పుడూ డాక్టర్ని అని చెప్పలేదని ఎవరిని తప్పుదారి పట్టించే ఉద్దేశం లేదని సోనాలి స్పష్టం చేయడం జరిగింది . అదేవిధంగా .. " నేను మోసగత్తిని కాదు నేను క్యాన్సర్ బాధ తెలిసిన మనిషిని " అనిత నా బాధని వెల్లడించింది . ఇక తన అనుభవం మరియు తనకు పని చేసిన విధానం మాత్రమే పంచుకున్నానని దాన్ని అందరూ ఫాలో అవ్వాలని చెప్పలేదని ఆమె తెలిపింది ‌.


ప్రతి క్యాన్సర్ వేరు మరియు ప్రతి ఒక్కరి చికిత్స విధానం వేరు అని మరోసారి గుర్తు చేయడం జరిగింది . ఇక క్యాన్సర్ తో పోరాడినప్పుడు ఎదురైన భయం మరియు నొప్పి అదే విధంగా మానసిక బాధలు అన్నిటిని నిజాయితీగా పంచుకోవడమే తన ఉద్దేశం అని తెలిపింది . క్యాన్సర్ నుంచి బయటపడిన తరువాత సోనాలి ఎప్పుడు ధైర్యం మరియు ఆశ అనే సందేశాలు ఇస్తూ ఉంటుంది . ఇక తన జర్నీతో చాలామందికి స్ఫూర్తినిస్తుందనే విషయం మాత్రం  వాస్తవం . ఏదేమైనప్పటికీ ప్రజెంట్ సోనాలి బింద్రే తన వ్యాఖ్యలను కరెక్ట్ చేసుకునే ప్రేక్షకులను క్షమాపణలు అడగడం జరిగింది . మరి ఈమె క్షమాపణలను ప్రేక్షకులు ఏ విధంగా తీసుకుంటారో చూడాలి .

మరింత సమాచారం తెలుసుకోండి: