దర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి పేరు ఇప్పుడు ఇండియన్ సినిమాకు మాత్రమే కాదు, గ్లోబల్ సినిమా మార్కెట్‌లో ఒక బ్రాండ్‌గా నిలిచింది. 'బాహుబలి', 'RRR' వంటి చిత్రాలతో ఆయన సృష్టించిన సంచలనం తర్వాత, ఇప్పుడు సూపర్ స్టార్ మహేష్ బాబుతో కలిసి చేస్తున్న అడ్వెంచర్ డ్రామా 'వారణాసి' (వర్కింగ్ టైటిల్)పై అంచనాలు ఆకాశాన్ని దాటేశాయి.తాజాగా సినీ వర్గాల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం.. 'వారణాసి' సినిమా డిజిటల్ (OTT) హక్కుల కోసం ప్రపంచంలోనే అతిపెద్ద ఓటీటీ దిగ్గజమైన నెట్‌ఫ్లిక్స్ (Netflix) ఏకంగా రూ.650 కోట్లు ఆఫర్ చేసినట్టు తెలుస్తోంది! ఈ భారీ ఆఫర్ అన్ని భాషల డిజిటల్ హక్కులకు కలిపి ఇచ్చింది. భారతీయ సినిమా చరిత్రలో ఇంత భారీ మొత్తంలో ఓటీటీ డీల్ రావడం ఇదే మొదటిసారి!


అయితే.. నెట్‌ఫ్లిక్స్ ఇచ్చిన ఈ రూ.650 కోట్ల బంపర్ ఆఫర్‌ను కూడా రాజమౌళి, నిర్మాతలతో కలిసి తిరస్కరించారు! ఈ అడ్వెంచర్ ఎపిక్ రేంజ్, దాని కంటెంట్ అవుట్‌పుట్, ప్రపంచవ్యాప్తంగా థియేటర్ల తర్వాత అది సృష్టించే ప్రభావాన్ని దృష్టిలో ఉంచుకుని.. రూ.650 కోట్లు కూడా తక్కువే అని మేకర్స్ భావించారట. ఈ సినిమా డిజిటల్ రైట్స్ సుమారు రూ.800 కోట్లకు పైగా పలుకుతాయని రాజమౌళి టీమ్ అంచనా వేస్తున్నట్టు సమాచారం!షూటింగ్ ప్రారంభానికి ముందే రూ.650 కోట్ల ఆఫర్‌ను కాదనుకోవడం అనేది రాజమౌళి కాన్ఫిడెన్స్‌కు నిదర్శనమా? లేక ఓవర్ కాన్ఫిడెన్స్‌గా కొందరు భావిస్తున్నారా? అన్న చర్చ ఇండస్ట్రీలో మొదలైంది. కానీ, 'RRR' సినిమా ప్రీ-రిలీజ్ బిజినెస్‌లో రాజమౌళి అంచనాలే నిజమయ్యాయి.



మహేష్ బాబు 'గ్లోబల్ అడ్వెంచరర్' పాత్రలో కనిపించబోతున్న ఈ చిత్రానికి సంబంధించి ఇప్పటికే విడుదలైన 'ప్రపంచ పరిచయ వీడియో'.. సినిమాపై అంచనాలను ఏ స్థాయిలో పెంచిందో మనకు తెలుసు. ఏదేమైనా.. రూ.650 కోట్ల ఆఫర్‌ను కూడా కాదనుకోవడం అనేది రాజమౌళి - మహేష్ బాబు కాంబో రేంజ్, ఇండియన్ సినిమా మార్కెట్ గతిని స్పష్టంగా తెలియజేస్తోంది!


మరింత సమాచారం తెలుసుకోండి: