ప్రస్తుతం జాన్వీ రామ్ చరణ్ నటిస్తున్న పెద్ది సినిమాలో కూడా నటిస్తోంది. ఈ చిత్రాన్ని డైరెక్టర్ బుచ్చిబాబు సన దర్శకత్వం వహించగా 2026 మార్చి 27 ఈ చిత్రాన్ని రిలీజ్ చేయబోతున్నారు. దీంతో తన ఫోకస్ మొత్తం సౌత్ ఇండస్ట్రీ పైన పెట్టినట్లుగా తెలుస్తోంది. ఇలాంటి సమయంలోనే జాన్వీ బాలీవుడ్ లో బడ నిర్మాతకు ఒక పెద్ద షాక్ ఇచ్చినట్లుగా వినిపిస్తోంది. తాజాగా ఈమె తీసుకున్న నిర్ణయం ఇండస్ట్రీలో చర్చనీయాంశంగా మారింది.
జాన్వీ ని హీరోయిన్గా పరిచయం చేసిన బడ ప్రొడ్యూసర్ కరణ్ జోహార్ కు షాక్ ఇచ్చినట్లుగా వినిపిస్తోంది. ధర్మ ప్రొడక్షన్ నుంచి ఈమె బయటికి వచ్చినట్లు వినిపిస్తున్నాయి. అలా బయటికి వచ్చి కలెక్టివ్ ఆర్టిస్ట్ నెట్వర్క్ అనే ఒక కొత్త సంస్థతో ఒప్పందం కుదుర్చుకున్నట్లుగా బాలీవుడ్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. అయితే ఇన్ని రోజులపాటు జాన్వీ ఏ సినిమా చేయాలి ఎలాంటి బ్రాండ్ కు ప్రచారం చేయాలనే విషయంపై ఎక్కువగా కరణ్ జోహార్ నిర్ణయించే వారు. దీంతో జాన్వీ పై ఎక్కువగా నెపోకిడ్ అనే ముద్రతో విమర్శలు వినిపించడంతో జాన్వీ ఇలాంటి సంచలన నిర్ణయం తీసుకున్నట్లు బిటౌన్ లో గుసగుసలు వినిపిస్తున్నాయి. మరి ఇందులో ఎంత నిజమో ఉందో చూడాలి మరి.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి