టాలీవుడ్లో ప్రముఖ నిర్మాతగా పేరు సంపాదించిన దిల్ రాజు తన నిర్మాణ సంస్థ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్ బ్యానర్ నుంచి బడా హీరోలతో  ఆరు సినిమాలని ప్లాన్ చేశారంటూ వార్తలు వినిపించాయి. దిల్ రాజు బ్యానర్ లో భారీ ప్రాజెక్ట్స్ హీరోల లిస్టు ఇదే అంటూ  ప్రచారం జరుగుతోంది. ఈ విషయం పై తాజాగా దిల్ రాజు టీమ్ ఒక కీలకమైన ప్రకటనని విడుదల చేసి రూమర్స్ కి చెక్ పెట్టారు. ముఖ్యంగా గత కొద్దిరోజులుగా వైరల్ గా అవుతున్న వార్తలలో ఎలాంటి నిజం లేదని తేల్చి చెప్పింది.


తాము ప్రస్తుతం బాలీవుడ్లో స్టార్ హీరోగా పేరు సంపాదించిన అక్షయ్ కుమార్ తో ఒక ప్రాజెక్టును మాత్రమే కన్ఫామ్ చేశామని తెలియజేశారు. ఈ సినిమాకి డైరెక్టర్ అనీస్ బజ్మీ  దర్శకత్వం వహించబోతున్నారని , ఇందుకు సంబంధించి ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయని నటీనటుల ఎంపిక కోసం సన్నాహాలు చేస్తున్నామంటూ తెలిపారు. దయచేసి ఎవరూ కూడా మా వైపు నుంచి ఎలాంటి అధికార ప్రకటన లేకుండా ఏలాంటి రూమర్స్ ని వైరల్ చేయవద్దు తప్పుడు వార్తలను , సొంత అంచనాలను సోషల్ మీడియాలో షేర్ చేయడం ఆపాలని ప్రేక్షకులను కోరుతున్నామంటూ తెలిపారు.


సినిమాకు సంబంధించిన అన్ని విషయాలను కూడా త్వరలోనే మేము మీతో పంచుకుంటామంటూ దిల్ రాజు బ్యానర్ నుంచి ఒక నోట్ విడుదల చేశారు. గత కొంతకాలంగా డైరెక్టర్ అనిల్ రావిపూడి, పవన్ కళ్యాణ్ , దిల్ రాజు బ్యానర్ పై ఒక సినిమా రాబోతోందని వార్తలు వినిపించాయి. ఈ చిత్రం మెసేజ్ తో పాటుగా ఎంటర్టైన్మెంట్ గా ఉంటుందని పవన్ కళ్యాణ్ డేట్ కూడా ఇచ్చారని ప్రచారం అయితే జరిగింది. ఈ విషయానికి సంబంధించి దిల్ రాజు టీమ్ ప్రకటనలో చెప్పకపోవడంతో వీరి కాంబినేషన్లో సినిమా లేదని తెలిసిపోతోంది. ఈ విషయం అటు పవన్ కళ్యాణ్ అభిమానుల నిరాశకు గురిచేస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: