సుదర్శన్ 70 ఎం.ఎం, ఓడియన్ 70 ఎం.ఎం వంటి ఐకానిక్ థియేటర్లు మూతపడటం చూసి అభిమానులు బాధపడ్డా… ఆ స్థలాల్లో ఇప్పుడు మరింత పెద్ద ఎంటర్టైన్మెంట్ వరల్డ్ రెడీ అవుతోంది. సుదర్శన్ స్థలంలో నిర్మించిన భారీ షాపింగ్ కాంప్లెక్స్లో ఏఎంబీ క్లాసిక్ గ్రాండ్గా తెరలేపేందుకు సిద్ధమైంది. గచ్చిబౌలిలో మహేశ్ బాబు - సునీల్ నారంగ్ కలిసి ఏర్పాటు చేసిన ఏఎంబీ సూపర్ హిట్ కావడంతో, అదే జోష్తో ఈ సెకండ్ వెంచర్ను ఆర్టీసీ క్రాస్ రోడ్స్లో స్టార్ట్ చేస్తున్నారు. ఏకంగా 7 స్క్రీన్లు ఉండే ఈ మల్టీప్లెక్స్ను పొంగల్కి ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్టు సమాచారం.
ఇక ఓడియన్ థియేటర్ల ఉన్న చోట కొత్తగా నిర్మించిన ఓడియన్ మాల్ కూడా ఓపెనింగ్కు సిద్ధంగానే ఉంది. ఇక్కడ 8 స్క్రీన్లతో భారీ మల్టీప్లెక్స్ రెడీ చేశారు. మొదట అక్టోబర్ 24కే లాంచ్ చేయాలని అనుకున్నా… చివరికి ముహూర్తం పొంగల్పై పడింది. అంటే ఆర్టీసీ క్రాస్ రోడ్స్లో ఏఎంబీ 7 స్క్రీన్లు మరియు ఓడియన్ 8 స్క్రీన్లు మొత్తం 15 కొత్త స్క్రీన్లు ఈ సంక్రాంతికి ప్రేక్షకులకు అందుబాటులోకి రానున్నాయన్నమాట.
కాగా, సింగిల్ థియేటర్ యుగం ముగిసిపోయినా… ఆర్టీసీ క్రాస్ రోడ్స్ ఆకర్షణ మాత్రం ఏమాత్రం తగ్గలేదు. పైగా ఇప్పుడు మల్టీప్లెక్స్ల రాకతో మరింత క్రేజీగా మారబోతోంది. వచ్చే పండగ నుంచి ఈ ప్రాంతంలో సినిమా వాతావరణం మళ్లీ పీక్కి చేరడం ఖాయంగా కనిపిస్తోంది.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి