ఈ రీ–రిలీజ్ కోసం మేకర్స్ ఒక అరగంటకు పైగా నిడివి కలిగిన స్పెషల్ వీడియో విడుదల చేశారు. ఇందులో సినిమా షూటింగ్ లోని అరుదైన క్షణాలు, గుర్తుండిపోయే సన్నివేశాల వెనుక కథలు, అప్పటి టీమ్ మెమొరీస్ ఇలా అనేక ఆసక్తికర విషయాలు అన్ని ఉన్నాయి. ముఖ్యంగా ఇందులో రజినీకాంత్ స్వయంగా చెప్పిన కొన్ని వ్యాఖ్యలు అభిమానుల్లో భారీ చర్చకు దారితీయడం విశేషం.ఈ వీడియోలో రజినీకాంత్ స్వయంగా తెలిపిన మాటల ప్రకారం, నరసింహకు సీక్వెల్ ఖచ్చితంగా ప్లాన్ చేస్తున్నారని కన్ఫర్మేషన్ ఇచ్చారు. అంతేకాకుండా ఆ సీక్వెల్కు “నీలాంబరి” అనే టైటిల్ కూడా ఫిక్స్ చేసినట్టు తెలిపారు.
ఇది విని ఫ్యాన్స్ లో ఉత్సాహం అంతకంతకూ పెరిగిపోతోంది. ఎందుకంటే మొదటి సినిమాలో రమ్యకృష్ణ పోషించిన “నీలాంబరి” పాత్ర ఎంత శక్తివంతమైందో చెప్పనక్కర్లేదు. ఇప్పుడు ఆ పాత్ర మీదే పూర్తిగా ఆధారపడి సీక్వెల్ వస్తున్నట్టు రజినీకాంత్ చెప్పడంతో ప్రేక్షకుల్లో ఆసక్తి మరింత పెరిగింది. ఇక్కడ అసలైన ప్రశ్న ఇదే. మరోసారి రమ్యకృష్ణ తనదైన ఠీవి, వేల్యనిజం, స్టైల్తో మెస్మరైజ్ చేయనున్నారా? లేకపోతే కథ పూర్తిగా కొత్త పద్ధతిలో, మరింత మోడ్రన్ టచ్ తో రూపొందబోతోందా? నీలాంబరి పాత్రను పూర్తిగా డిఫరెంట్ ఆంగిల్ లో చూపించబోతున్నారా? అనే విషయాలపై భారీ కుతూహలం నెలకొంది.ఇప్పటికే సీక్వెల్ కథపై డిస్కషన్స్ జరుగుతున్నాయి అని టీమ్ వెల్లడించడం వల్ల, ప్రాజెక్ట్ వేగంగా ముందుకు సాగే అవకాశం ఉందనే చెప్పాలి.
మొదటి సినిమా డిసెంబర్ 12న గ్రాండ్ రీ–రిలీజ్గా ప్రేక్షకుల ముందుకు రానుండగా, రజినీకాంత్ అభిమానులు ఈ తేదీని మహోత్సవంలా సెలబ్రేట్ చేసుకునేందుకు ఏర్పాట్లు ప్రారంభించారు.ఓవర్ ఆల్..నరసింహ రీ–రిలీజ్..అరగంట స్పెషల్ వీడియో..రజినీకాంత్ స్వయంగా సీక్వెల్ కన్ఫర్మ్..“పడయప్ప 2” టైటిల్ .. “నీలాంబరి”..రమ్యకృష్ణ పాత్ర మరోసారి హైలైట్..అన్నీ కలిపి ప్రస్తుతం కోలీవుడ్ మాత్రమే కాదు, మొత్తం ఇండియన్ సినిమా ఆడియన్స్ లో ‘నరసింహ–నీలాంబరి’ పై హైప్ ట్రెమండస్ గా పెరుగుతోంది.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి