హర్షాలీ మల్హోత్రా ఇప్పటికే బాలీవుడ్లో చిన్న వయసులోనే మంచి గుర్తింపును సంపాదించుకుంది. పలు చిత్రాల్లో తన సహజమైన నటనతో ప్రశంసలు అందుకున్న ఆమె, ‘అఖండ 2’లోనూ అదే స్థాయిలో మెప్పించి, ఈ పాత్రకు పూర్తి న్యాయం చేసింది. బాలకృష్ణతో ఆమెకు ఏర్పడిన తండ్రీ–కూతురు బంధం ప్రేక్షకులను బాగా కనెక్ట్ చేసింది.అయితే, ఈ పాత్రకు సంబంధించి ఇప్పుడు సోషల్ మీడియాలో ఒక ఆసక్తికరమైన విషయం చర్చనీయాంశంగా మారింది. తొలుత జనని పాత్ర కోసం ఒక స్టార్ హీరో కుమార్తెను ఎంపిక చేయాలనే ఆలోచనలో మేకర్స్ ఉన్నారని ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి. సూపర్ స్టార్ మహేష్ బాబు కుమార్తె సితార ఘట్టమనేని ఈ పాత్రలో నటించాల్సిందిగా ప్లాన్ చేశారట.
కానీ, ఈ విషయంలో మహేష్ బాబు స్పష్టమైన నిర్ణయం తీసుకున్నారని సమాచారం. సితార ఇప్పుడే సినిమాల్లోకి అడుగుపెట్టదని, ఆమె ఇంకా చదువుపై దృష్టి పెట్టాల్సిన దశలో ఉందని ఆయన తేల్చి చెప్పారట. అంతేకాకుండా, సితార భవిష్యత్తులో సినిమాల్లోకి వస్తే అది హీరోయిన్గా మాత్రమే కావాలని ఆయన అభిప్రాయమని టాక్ వినిపిస్తోంది. ఈ కారణాల వల్లే ఆ ఆఫర్ను సున్నితంగా తిరస్కరించినట్టు తెలుస్తోంది.దీంతో చివరకు ఆ అవకాశం హర్షాలీ మల్హోత్రాకు దక్కిందని సినీ వర్గాలు వెల్లడిస్తున్నాయి. సితార ఈ పాత్రలో నటించి ఉంటే ఎలా ఉండేదో అని మహేష్ బాబు అభిమానులు ఊహించుకుంటూ సోషల్ మీడియాలో చర్చలు సాగిస్తున్నారు. అయినప్పటికీ, హర్షాలీ మల్హోత్రా తన సహజమైన నటనతో ఆ పాత్రను మరింత గుర్తుండిపోయేలా మార్చిందని ఎక్కువ మంది ప్రేక్షకులు అభిప్రాయపడుతున్నారు.
మొత్తానికి, ‘అఖండ 2’ విజయంలో బాలకృష్ణ పవర్ఫుల్ నటనతో పాటు, చిన్నారి హర్షాలీ మల్హోత్రా పాత్ర కూడా కీలక పాత్ర పోషించిందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ఈ సినిమా బాలయ్య కెరీర్లో మరో మైలురాయిగా నిలిచిందని అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి