సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న సమాచారం ప్రకారం, జూనియర్ ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ హెల్త్ గురించి బాగా టెన్షన్ పడుతున్నారట. ఇటీవల ప్రశాంత్ నీల్కు బ్యాక్ టు బ్యాక్ వైరల్ ఫీవర్స్ రావడం వల్ల పూర్తిగా అలసిపోయారని సమాచారం. డాక్టర్లు స్పష్టంగా బెడ్ రెస్ట్ తీసుకోవాలి అని చెప్పినప్పటికీ, ప్రశాంత్ నీల్ మాత్రం ఆ సలహాను పెద్దగా పట్టించుకోకుండా తన కొత్త సినిమా ‘డ్రాగన్’ (వర్కింగ్ టైటిల్)కు సంబంధించిన ఎక్స్క్లూజివ్ షూటింగ్లో బిజీగా ఉన్నారట.
ఈ విషయం మొదట ఎన్టీఆర్కు తెలియలేదట. కానీ ఆలస్యంగా ఇది తెలుసుకున్న వెంటనే, ఆయన ప్రశాంత్ నీల్పై గట్టిగానే సీరియస్ అయ్యారట. “అంత ఫీవర్ ఉన్నా కూడా షూటింగ్ ఎందుకు కంటిన్యూ చేస్తున్నావ్? హెల్త్ ఇంపార్టెంట్ కదా!”అంటూ ఎన్టీఆర్ ఘాటుగా మాట్లాడినట్టు టాక్. జూనియర్ ఎన్టీఆర్ సినిమాల విషయంలో ఎంత కాన్సన్ట్రేషన్తో, ఎంత సీరియస్గా ఉంటారో తెలిసిందే. అదే స్థాయిలో, తనతో పని చేసే వాళ్ల ఆరోగ్యంపై కూడా అంతే స్ట్రిక్ట్గా ఉంటారు. ముఖ్యంగా ప్రశాంత్ నీల్ అంటే ఎన్టీఆర్కు ప్రత్యేకమైన ఇష్టం, గౌరవం ఉందని సినీ వర్గాల్లో ఎప్పటి నుంచో టాక్ ఉంది.
అలాంటి పరిస్థితుల్లో, ప్రశాంత్ నీల్ ఆరోగ్యం సరిగా లేకపోయినా షూటింగ్ చేస్తూ ఉంటే, ఎన్టీఆర్ ఊరుకుంటారా? అందుకే ఆయన ప్రశాంత్ నీల్పై సీరియస్ అయ్యారని, కానీ అది పూర్తిగా ఆయన ఆరోగ్యం కోసమేనని స్పష్టమవుతోంది. చివరికి జూనియర్ ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ తప్పకుండా రెస్ట్ తీసుకునేలా మాట్లాడారని, హెల్త్ ఫస్ట్, సినిమా తర్వాత అన్న మెసేజ్ క్లియర్గా ఇచ్చారని సమాచారం. ఈ ఘటనతో మరోసారి ఎన్టీఆర్ మనసు ఎంత పెద్దదో, తన కో-వర్కర్స్ని ఎంతగా కేర్ చేస్తారో అభిమానులు ప్రశంసలు కురిపిస్తున్నారు.అందుకే ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ న్యూస్కి అసలు అర్థం ఇదే —ఇది గొడవ కాదు… గాఢమైన కేర్.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి