మెగా ఫ్యామిలీ హీరోలలో అందరు హీరోలు ఏదో ఒక సూపర్ హిట్ సినిమాలలో నటించిన ట్రాక్ రికార్డ్ ను కొనసాగిస్తున్నా ఒక్క అల్లు శిరీష్ మాత్రం తన సినిమాలకు సంబంధించి చెప్పుకోతగ్గ హిట్ ను ఇప్పటి వరకు అందుకోలేకపోయాడు. అల్లు కాంపౌండ్ సపోర్ట్ ఉన్నా ఈహీరో ఇప్పటి వరకు చేసిన సినిమాలలో ఏఒక్క సినిమా అతడికి చెప్పుకోతగ్గ బ్రేక్ ఇవ్వలేకపోయాయి. 
Box Office Pressure? Never Let It Burden Me: Allu Sirish
ప్రస్తుతం ఈ అల్లువారి అబ్బాయి మలయాళంలో హిట్ అయిన ‘ఏబీసీడీ’  అమెరికన్ బోర్న్ కన్ఫ్యూజ్డ్ దేశీ అనే సినిమాను ఈమధ్యనే మొదలు పెట్టాడు. ఇలాంటి పరిస్థుతులలో ఈయంగ్ హీరోను ఒక ప్రముఖ మల్టీ నేషనల్ కంపెనీ మోసం చేసింది అంటూ గగ్గోలు పెడుతున్నాడు. 
FWD Life In Conversation With The Telugu Star Allu Sirish On Making His Mollywood Debut (2)
అల్లు శిరీష్ కోపం అంతా ప్రస్తుతం వోడా ఫోన్ నెట్ వర్క్ పై ఉంది. ఎయిర్ టెల్ నెట్ వర్క్ బ్యాడ్ అని నమ్మి శిరీష్ ఈమధ్యనే వోడా ఫోన్ నెట్ వర్క్ కి మారాడట. అయితే తన ఫోన్ కు వోడా ఫోన్ సిగ్నల్స్ అందడం లేదని ఒక చెత్త నెట్ వర్క్ కు మారి తాను మోసపోయాను అంటూ తన ట్విటర్ లో కామెంట్ చేసి వోడా ఫోన్ యాజమాన్యం పై తీవ్ర విమర్శలు చేసాడు. 
Allu Sirish
‘దేని విలువైనా మీదగ్గర ఉన్నంత కాలం దాని విలువ తెలియదు. ఈమధ్యనే ఎయిర్ టెల్ నుండి వోడా ఫోన్ కు మారి నా పరిస్థితిని అయోమయం చేసుకున్నాను’ అంటూ కామెంట్ చేసాడు శిరీష్. ప్రస్తుతం తాను 4జీ మరిచిపోయి 2 జీ సిగ్నల్స్ కూడ అందని ఒక చెత్త నెట్ వర్క్ లో రోజులు గడుపుతున్నాను అంటూ శిరీష్ వేదనను చూసినవారు వోడా ఫోన్ దెబ్బకు సామాన్యులే కాదు సెలెబ్రెటీ హోదాలో ఉన్నవారు కూడ బలి అవుతున్నారు అంటూ జోక్ చేస్తున్నారు..   


మరింత సమాచారం తెలుసుకోండి: