ఖలిస్తాన్‌ తీవ్రవాదుల హెడ్ హర్దీప్ సింగ్ నిజ్జర్ కెనడాలో అనుమానాస్పద స్థితిలో హత్య చేయబడిన సంగతి మనకు తెలిసిందే. అయితే ఈ తీవ్రవాది హత్య వెనకాల భారతదేశం యొక్క రీసెర్చ్ అనాలసిస్ వింగ్ హస్తం ఉందని కెనడా ప్రధాని ఆరోపిస్తున్నారు. ఈ మధ్య భారత్ పైకి, లేదా గతంలో భారత్ లో దాడులు చేసినటువంటి, దారుణాలు జరిపినటువంటి తీవ్రవాదులను భారత్ సైన్యం సీక్రెట్ గా ఏరిపారేస్తుంది.


అలాంటి ఆపరేషన్ లో ఒక భాగమే ఈ తీవ్రవాదుల హెడ్ చనిపోవడానికి కారణం అని తెలుస్తుంది. అమెరికా, బ్రిటన్, ఆస్ట్రేలియాలను కూడా  కెనడా ఇప్పుడు భారత్  వైఖరిని ఖండించండి అని చెబుతుందట. కానీ వాళ్ళు ఎవరు ఖండించడానికి సిద్ధంగా లేరని తెలుస్తుంది. ముఖ్యంగా అమెరికా ఇందులో జోక్యం చేసుకోవడానికి సిద్ధంగా లేదు. అమెరికాకు సంబంధించిన భద్రతా విభాగం భారత్ సహకరిస్తే ఈ కేసు తేలుతుంది అని చెప్తుందట.


కానీ అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ చెప్పేది మాత్రం దీనికి భిన్నంగా ఉంది. ఆయన చెప్పేది ఏమిటంటే ఇది ఆ రెండు దేశాలు మాట్లాడుకోవాల్సిన విషయం, ఈ విషయంలో నేను కల్పించుకోను అని. అంతే కాకుండా తీవ్రవాది హత్య విషయంలో భారతదేశ పాత్రని బహిరంగంగా ఖండించడానికి కూడా ఆయన ఒప్పుకోలేదు. బ్రిటన్ తర్వాత మరొక మిత్ర రాజ్యం హర్దీప్ సింగ్  నిజ్జర్ హత్య విషయంలో భారత్  పాత్రను ఖండించమని కెనడా అడగటాన్ని నిందించింది.


భారత్‌పై విరుచుకుపడాలని కెనడా చేసిన అభ్యర్థనపై అమెరికా విముఖత వ్యక్తం చేసింది. జీ20 శిఖరాగ్ర సమావేశానికి ముందు కెనడా ఖలిస్థాన్ అనుకూల ఉగ్రవాది హార్దిప్ సింగ్ నిజ్జర్ హత్య పై  అన్ని దేశాలను కదిపిందని వాషింగ్టన్ పోస్ట్ నివేదించింది. ఈ రకంగా కెనడా భారత్ పై తన అక్కసును చూపిస్తుంది. జీ20 సమావేశాలప్పుడు హర్దీప్ సింగ్ నిజ్జర్  హత్యపై భారత్ పాత్ర గురించి ఖండించమని అమెరికన్ మీడియా అడిగినప్పుడు కూడా అమెరికా ప్రభుత్వం స్పందించలేదని తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: