మొయినాబాద్ లోని సుజాత స్కూల్ లో జ్వాల గుత్తా అకాడమీ ఆఫ్ ఏక్సిలెన్స్ ని ఐటీ మినిస్టర్, తెలంగాణ బ్యాడ్మింటన్ అసోసియేషన్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రారంభించారు. ప్రారంభోత్సవ కార్యక్రమంలో ద్రోణాచార్య అవార్డు గ్రహీత ఎస్.ఎమ్.ఆరిఫ్,  స్పోర్ట్స్ మినిస్టర్ శ్రీనివాస్ గౌడ్, శాట్స్ అధికారులు, జ్వాల కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. 55 ఎకరాల విస్తీర్ణంలో 600 ల సీటింగ్ కేపాసిటీతో 14 అంతర్జాతీయ బ్యాడ్మింటన్ కోర్ట్స్,  క్రికెట్ అకాడమీ, స్విమింగ్ పూల్, వరల్డ్ క్లాస్ జిమ్, యోగ సెంటర్ లను ఏర్పాటు చేసారు.

ఈ సందర్భంగా గుత్తా జ్వాల మాట్లాడారు. అకాడమీ కల నెరవేరింది అని ఆమె అన్నారు. హైదరాబాద్ నుంచి మరింత మంది ఒలంపియన్ లను తయారు చేయడమే నా లక్ష్యం అని ఆమె పేర్కొన్నారు. జేజీ అకాడమీ ఆఫ్ ఎక్సలెన్స్ లో  బ్యాడ్మింటన్ తో పాటు స్విమ్మింగ్, క్రికెట్ లను ట్రైనింగ్ అందిస్తాం అని పేర్కొన్నారు.  మంత్రి శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ... బ్యాడ్మింటన్ లొనే స్టార్ గా ఎదిగిన జ్వాల.. తనలాంటి ప్లేయర్లు తీర్చిదిద్దేoదుకు అకాడెమీ స్థాపించడం గర్వకారణం అన్నారు. గ్రామీణ ప్రాంతాల్లోని టాలెంట్ ని వెలికితీసేందుకు ప్రతి ఏడాది సీఎం కప్ నిర్వహిస్తామని జ్వాల చెప్పడం సతోషించదగ్గ విషయం అని ఆయన చెప్పారు.

గ్రామీణ ప్రాంతాల్లో 100కి పైగా స్టేడియాలు నిర్మిస్తాం అన్నారు. మంత్రి కేటిఅర్ మాట్లాడుతూ... అకాడమీ స్థాపించిన జ్వల గుత్తా కి, తన కుటుంబ సభ్యులకు హార్ధిక శుభాకాంక్షలు చెప్పారు. చైనాలో లాగా భారత్ లోను స్పోర్ట్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెంచుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని తెలంగాణలో పెంచేందుకు త్వరలోనే కొత్త స్పోర్ట్స్ పాలసీని తీసుకోస్తాం అన్నారు.  ఇది దేశానికే ఆదర్శంగా నిలుస్తుంది అనుకుంటున్న అని ఆయన పేర్కొన్నారు. జ్వాల అకాడమీ రన్ చేసేందుకు స్పోర్ట్స్ అకాడమీ ఆఫ్ తెలంగాణ నుంచి పూర్తి సహకారం అందిస్తదని ఆయన పేర్కొన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: