గత 20 ఏళ్లలో ఎయిమ్స్ వైద్యులు క్రేనియోటమీ విధానంలో 500పై చిలుకు ఈ విధంగా శస్త్రచికిత్స చేసినట్టు అధికార వర్గాలు మీడియాకు వివరించాయి. డిసెంబరు 2018లో జైపూర్లోని సవాయ్ మాన్సింగ్ ఆస్పత్రిలో కూడా ఇదే విధానంలో ఆపరేషన్ నిర్వహించారు. గతంలో బెంగళూరులో ఇలానే గిటార్ వాయిస్తుండగా ఓ వ్యక్తికి వైద్యులు బ్రెయిన్ సర్జరీ చేసి విజయవంతం అయ్యారు.
ఇదే విధంగా ఓ మహిళకు కూడా మెదడుకు ఎడమ వైపున ఉన్న కణతిని శస్త్ర చికిత్స ద్వారా వైద్యులు తొలగించారు. అనంతరం తనకు ఏమీ జరగలేదు అన్నట్టు ఆ మహిళా ఆపరేషన్ థియేటర్ నుంచి తల అటూ ఇటూ ఊపుతూ బయటకొచ్చారు. ఆపరేషన్ జరుగుతున్న సమయంలో అక్కడున్న వైద్య సిబ్బందిలో ఒకరు ఈ దృశ్యాలను ఫోన్లో రికార్డు చేశారు. దీన్ని సోషల్ మీడియాలో పోస్టు చేయడంతో ప్రస్తుతం ఈ విడియో వైరల్ అయింది.
ఆపరేషన్ అనంతరం ఎయిమ్స్ న్యూరోసర్జరీ విభాగం వైద్యుడు డాక్టర్ దీపక్ గుప్తా మీడియాతో మా
ట్లాడారు. 24 ఏళ్లున్న మహిళకు మెదడులో కణతి ఏర్పడిందని, శస్త్రచికిత్స ద్వారా ఆ కణతిని తొలగించామని తెలిపారు. మూడు గంటల సమయం పాటు జరిగిన సుదీర్ఘ ఈ ఆపరేషన్లో మహిళ మెలకువతోనే ఉందని ఆయన తెలిపారు. ఆమె తలపై మాడు భాగంలోనే అనెస్తీషియాను ఇచ్చి, నొప్పి నివారణ మందు ఇచ్చామన్నారు. ఈ ఆపరేషన్ విజయవంతమయ్యిందని, ప్రస్తుతం ఆ మహిళ పర్యవేక్షణలో ఉందని శనివారం డిశ్చార్జ్ చేయనున్నట్టు డాక్టర్ దీపక్ విరించారు.