టీడీపీ-జనసేన పొత్తు పెట్టుకుంటే మాకు వచ్చే నష్టం ఏమి లేదని, జగన్ మగాడు అని, ఒక్కడే పొరాడి మళ్ళీ గెలుస్తారని చెప్పి వైసీపీ నేతలు గట్టిగానే చెబుతున్న విషయం తెలిసిందే..అంటే పొత్తు ఉన్నా సరే తమకు ఇబ్బంది ఏమి లేదని అంటున్నారు. అయితే పైకి మాత్రం ఈ మాటలు అని అర్ధమవుతుంది...కానీ లోపల మాత్రం పొత్తు విషయంలో వైసీపీ నేతలు బాగానే భయపడుతున్నట్లు తెలుస్తోంది. ఆల్రెడీ పొత్తు ఉంటే ఎలా ఉంటుందో 2014 ఎన్నికలు రుజువు చేశాయి..పొత్తు లేకపోతే ఎలా ఉంటుందో 2019 ఎన్నికలు రుజువు చేశాయి.

టీడీపీ-బీజేపీకి పవన్ సపోర్ట్ చేయడం వల్ల 2014 ఎన్నికల్లో అధికారంలోకి వచ్చారు...2019 ఎన్నికల్లో పవన్ విడిగా పోటీ చేయడం వల్ల ఓట్లు చీలిపోయి టీడీపీకి భారీగానే డ్యామేజ్ జరిగింది...దీని వల్ల వైసీపీకి లాభం జరిగింది..ఇప్పుడు మళ్ళీ పవన్, టీడీపీతో పొత్తు పెట్టుకునేందుకు చూస్తున్నారు..అదే జరిగితే తమకు నష్టమనే విషయం వైసీపీ నేతలకు అర్ధమవుతుంది..అందుకే పొత్తుకు బ్రేకులు వేయడానికి వైసీపీ నేతలు చూస్తున్నారు.

పరోక్షంగా జనసేన శ్రేణులని రెచ్చగొడుతున్నారు...అసలు పవన్ సీఎం అవ్వకుండా, చంద్రబాబు సీఎం అవ్వడానికి కృషి చేస్తున్నారని, ఇంకా జనసేన శ్రేణులు చంద్రబాబు పల్లకి మోయడానికి రెడీగా ఉండాలని చెప్పి వాళ్ళని రెచ్చగొడుతున్నారు. తాజాగా కూడా మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి..పరోక్షంగా పొత్తుకు బ్రేక్ వేసేలా మాట్లాడారు.

పవన్‌కు సీఎం పదవి ఇస్తానంటే పొత్తు పెట్టుకున్నా అర్ధం ఉంటుందని, కానీ చంద్రబాబును సీఎంను చేయటానికి పవన్ రెడీ అయ్యారని, అంటే బాబుని సీఎంని చేసి రాష్ట్ర సమస్యలు తీరుస్తానని పవన్ ఎలా చెబుతారని బాలినేని అడుగుతున్నారు. అంటే పరోక్షంగా పవన్‌ని సీఎం పదవి ఇవ్వమని బాబుని అడగమని చెబుతున్నట్లు కనిపిస్తోంది. ఎలాగో బాబు...సీఎం పదవి పవన్‌కు ఇవ్వరు..కాబట్టి పొత్తు ఉండదు..అదే బాలినేని కాన్సెప్ట్..అంటే చివరికి ఎలాగో అలాగా టీడీపీ-జనసేన పొత్తు లేకుండా చేయాలనేది వైసీపీ నేతల ప్రోగ్రాం.


మరింత సమాచారం తెలుసుకోండి: