
అయితే ఈ కేసు ఇప్పటిది కాదట... గతంలో 2014 వ సంవత్సరంలో తెలంగాణలో హుజూర్ నియోజకవర్గం ఎన్నికల సమయంలో ఎలక్షన్ కమిషన్ చెప్పిన నియమాలను ఉల్లంఘించిన కారణంగా అప్పట్లో ఆరోపణలు ఉండడం తెలిసిందే. అయితే అప్పుడు జగన్ తో పాటుగా మరో ఇద్దరు వైసీపీ నాయకులు అయిన శ్రీకాంత్ రెడ్డి మరియు నాగి రెడ్డి లపై కూడా ఆరోపణలు ఉన్నాయి. దాదాపుగా 8 సంవత్సరాల తర్వాత ఈ కేసులో జగన్ కు సమన్లు జారీ చేయడం, అందులోనే జగన్ ఇప్పుడు ఒక రాష్ట్రాలను సీఎం కావడం తో ప్రజలు అంతా కంగు తింటున్నారు. ఇందులో భాగంగా సీఎం జగన్ మరియు మిగిలిన ఇద్దరు కూడా ఈ నెల 28 వ తేదీన నాంపల్లి కోర్టుకు విచారణ నిమిత్తం హాజరు కావలసి ఉన్నదని కోర్ట్ ఆదేశాలు జారీ చేసింది.
దీనితో ఇప్పటికే ఉన్న కేసులతో పాటుగా ఇది కూడా పక్కన చేరింది. అయితే కేసులు అయితే ఉన్నాయి. క్నీ వీటికి ఎప్పుడు పరిష్కారం దొరుకుతుందో అని జగన్ అభిమానులు కోరుకుంటున్నారు. మరి ఇందులో ఏమైనా మతలబు ఉందా? ఇది ఒక రాజకీయ వ్యూహమా ? అన్న కోణంలోనూ రాజకీయ విశ్లేషకులు ఆలోచిస్తున్నారు.