చెప్పుతో కొడతానని జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ చేసిన కామెంట్లపై ఏపీ మంత్రి జోగి రమేష్ తీవ్రంగా మండిపడ్డారు.కొన్ని నిమిషాల ముందే ముసుగు వీరుల ముసుగు తొలగిపోయిందని.. ఎప్పట్నుంచో తాము చెప్తున్నట్టుగా ముసుగు దొంగలిద్దరు ఒక చోట చేరిపోయారని విమర్శించారు. ప్రజలకి కూడా వీళ్ళ నిజ స్వరూపం తెలిసిపోయిందన్నారు. పవన్ కళ్యాణ్‌ను ప్యాకేజ్ కళ్యాణ్ అని తాను ఇప్పుడు కూడా చెప్తున్నానని.. ప్యాకేజ్ 'స్టార్' అనడం కొంత ఇబ్బందేనని సెటైర్లు వేశారు. సినిమాలో నటించే విధంగానే రాజకీయాల్లోనూ నటిస్తున్నాడని ఎద్దేవా చేశారు.


ప్యాకేజీ తీసుకోకపోతే.. ఎప్పుడైనా నేను ముఖ్యమంత్రి అవుతానని ధైర్యంగా చెప్పావా? అని పవన్‌ని నిలదీశారు. నువ్వు చూపించిన చెప్పు ఇంతకు నీదేనా? లేక నీ యజమాని కొనిచ్చాడా? అంటూ పవన్‌ను జోగి రమేష్ ప్రశ్నించారు. 2019లో ఏపీ ప్రజల్ని మిమ్మల్ని చెప్పులు అరిగేటట్లు, చెంపలు చెళ్లుమనిపించారని.. ఎన్నికల్లో యుద్ధం చేసి ఓడిపోలేదా? అని అడిగారు. పవన్ చేతికి నిన్న ఎక్కువ ప్యాకేజీ అందినట్లుందని.. అందుకే ఎక్కువ మాట్లాడేశాడని ఆరోపించారు. విశాఖ గర్జన సక్సెస్ అవ్వడంతో.. తమపై పవన్ దాడి చేయించాడని ఆరోపణలు చేశారు. ఈరోజు ఆ సైకొలను మరింత రెచ్చగొట్టాడని అన్నారు. 


పవన్ కళ్యాణ్ ఓ పిచ్చికుక్క అని.. ఆయన వాగుడుతో అది తేటతెల్లమైందని తెలిపారు. అభివృద్ది ప్రతి గడపకు చేరాలని ముఖ్యమంత్రి తప పడుతున్నారన్నారు. వైసీపీ సిద్ధాంతం మూడు రాజధానులైతే.. పవన్ కళ్యాణ్‌ది మూడు పెళ్లాలా సిద్ధాంతమని విమర్శించారు. పొద్దున బీజేపీకి విడాకులిచ్చి.. ఇప్పుడు చంద్రబాబును మరోసారి పెళ్లి చేసుకున్నాడని ఎద్దేవా చేశారు. అధికారం కోసం ఏ పార్టీనైనా పెళ్లి చేసుకోవడం, ఆ తర్వాత విడాకులు ఇవ్వడమే వీళ్ల సిద్ధాంతమని సెటైర్లు సంధించారు.చంద్రబాబు సంకలో పవన్ కళ్యాణ్ ఉన్నాడన్న ముసుగు ఇప్పుడు తొలగిపోయిందని పేర్కొన్నారు. సినిమా డైలాగులు ఎక్కడ చెప్పాలో తెలియక.. ఇక్కడ మాట్లాడుతున్నాడని కౌంటర్లు వేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: