ప్రస్తుతం జగన్ నేతృత్వంలోని వైసీపీ ఏపీలో అధికారంలో ఉంది. ఎన్నికలకు ముందు జగన్ ప్రజలకు ఇచ్చిన హామీలను దాదాపు నెరవేర్చుకున్నట్లే అని క్లియర్ గా తెలుస్తోంది. కానీ జగన్ కేవలం సంక్షేమ పథకాలపైనే తన దృష్టిని కేంద్రీకరించారు. అయితే ప్రతిపక్షాల వాదనను బట్టి ఏపీకి ప్రత్యేక హోదా, అభివృద్ధి, రాజధాని అంశం మరియు పోలవరం ప్రాజెక్ట్ ల విషయంలో దారుణంగా ఫెయిల్ అయ్యాడని ఘంటాపధంగా చెబుతున్నారు. కానీ జగన్ మాత్రం ఈ విమర్శలను పట్టించుకోకుండా సంక్షేమమే తనను గెలిపిస్తుందని ఎన్నికల ముందు పార్టీ నాయకులు మరియు ప్రజా ప్రతినిధులతో ఈ మధ్య నిర్వహించిన కొన్ని పార్టీ మీటింగ్ లలో ఈసారి ఖచ్చితంగా 175 కి 175 సీట్లు సాధించాలని పిలుపునిచ్చారు.

కానీ జగన్ అనుకున్న విధంగా జరగడం అంత సులభం కాదు. ఒకవేళ మొత్తం సీట్లు వైసీపీకి రావాలంటే, ఏకంగా ఏదైనా అద్భుతం జరగాలి లేదా వైసీపీ పాలన లో ప్రతిపక్షాలు కానీ లేదా ప్రజలు కానీ ఒక్క నెగటివ్ పాయింట్ కూడా లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. కాబట్టి ఇవి రెండూ జరగడానికి మార్గమే లేదు.. అందుకే ఇక జగన్ 175 ఎమ్మెల్యే సీట్ల గురించి మరిచిపోవాలి. దానికి బదులుగా గత ఎన్నికల్లో గెలిచిన 151 చోట్ల గెలవడానికి ప్రయత్నించాలి. ఎందుకంటే గత ఎన్నికల ముందు ఉన్న పరిస్థితులు ఇప్పుడు ఏపీలో లేవు. అప్పార్ట్లో వైసీపీ ఒక కొత్త పార్టీ మరియు జగన్ మీద సానుభూతి కూడా వర్క్ అవుట్ అయింది. కానీ ఇప్పుడు చాలా వ్యత్యాసం ఉంది.

మూడున్నరేళ్ల వైసీపీ అధికార కాలంలో చాలా వరకు కొన్ని పొరపాట్ల కారణంగా ఎన్నో విమర్శలను ఎదుర్కొంది పార్టీ. ఆలా చూసుకుంటే ఇప్పుడు రాష్ట్రంలో సగానికి పైగా వైసీపీపై వ్యతిరేకత నెలకొంది. ఈ వ్యతిరేకతను కొంతవరకు అయినా పోగొట్టుకోవాలి అంటే మిగిలిన ఈ ఒకటిన్నర సంవత్సరంలో ప్రజలకు నచ్చే అంశాలపై దృష్టిని పెట్టాలి. లేకపోతే మొదటికే మోసం వచ్చే అవకాశం లేకపోలేదు. మరి జగన్ ఈ అంశాలను అన్నింటినీ పరిగణలోకి తీసుకుని ఎటువంటి జాగ్రత్తలు, వ్యూహాలు అమలు పరచనున్నాడు అన్నది తెలియాల్సి ఉంది.







మరింత సమాచారం తెలుసుకోండి: