ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పై జగన్ చేసిన ఢిల్లీ పర్యటన పై సంచలన వ్యాఖ్యలు చేసిన మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు కేసులు కోసమే జగన్ ఢిల్లీ వెళుతున్నారని విమర్శించారు. రాష్ట్ర ప్రయోజనాలు మరియు విభజన చట్టం అంశాల గురించి జగన్ ఏ మాత్రం పట్టించుకోవడం లేదని చెప్పిన యనమల అతను ఎప్పుడు ఢిల్లీ వెళ్ళినా కూడా తన సొంత కేసులు ,డిశ్చార్జ్ పిటిషన్ లో మరియు ప్రతి శుక్రవారం కోర్టుకు హాజరు మినహాయింపు కోసమే కేంద్రం వద్దకు వెళ్తున్నారు అని వ్యాఖ్యానించారు.

 

అయితే వరుసగా రెండోసారి ఢిల్లీలో జగన్ కు నిరాశ ఎదురైంది అని చెప్తున్న ఈయన ఫెమా, మనీలాండరింగ్ పై సిబిఐ మరియు ఈడి కేసులో జగన్ పీకల్లోతు కూరుకుపోయాడని విమర్శించారు. రెండవ సారి జగన్ కు అమిత్ షా అపాయింట్మెంట్ ఇవ్వని నేపథ్యంలో ప్రజా ప్రయోజనాల కోసం కలవడానికి వస్తే ఎవరైనా అనుమతిస్తారని తన కేసుల గురించి అడుగుతున్నారు కాబట్టి అతనికి ఎటువంటి అపాయింట్మెంట్లు ఇవ్వడం లేదని అన్నారు. అంతేకాకుండా స్థానిక సంస్థల ఎన్నికల్లో పత్రికల్లో ప్రకటనలు తప్ప వాటి అమలు ఏమాత్రం లేదని యనమల చెప్పడం విశేషం.

 

రాష్ట్రంలో ఏ పంటకు గిట్టుబాటు ధర అందడం లేదని.. భారీ వర్షాలతో పంట ఉత్పత్తులు తగ్గాయి అన్నారు మాజీ మంత్రి. వేరుశనగ, శనగ, పత్తి, ధాన్యం దేనికీ సరైన ధర లేదన్నారు. రాష్ట్రంలో ఎక్కడ చూసినా దళారులు రెచ్చిపోతున్నారని.. రైతులను,ఇటు వినియోగదారులను దోచుకుంటున్నారు అన్నారు. టీడీపీ సర్కార్ హయాంలో రైతుల్ని, వినియోగదారుల్ని ఆదుకున్నాం అన్నారు. ఉన్న పథకాలను రద్దు చేస్తున్నారని.. కొత్తవాటిని నెలల తరబడి వాయిదా వేస్తున్నారని ఆరోపించారు. ప్రతి పథకంలో అనేక కోతలు పెడుతున్నారని.. అలా ఆదా అయిన డబ్బుతో కొత్త స్కీమ్ అంటూ బిల్డప్ ఇస్తున్నారన్నారు. వైఎస్సార్‌సీపీ సర్కార్ 6నెలల వైఫల్యాలను అసెంబ్లీ, మండలిలో ఎండగడతాం అన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: