నిత్యం వివాదాల్లో ఉండే వ్యక్తుల్లో కత్తి మహేశ్ ఒకరు. సినీ క్రిటిక్ గానూ.. విమర్శకుడిగా.. నటుడిగా.. దర్శకుడిగా.. ఇలా కత్తి మహేశ్ లో అనేక కోణాలున్నాయి. అన్నింటి కంటే ఎక్కువగా ఆయన కాంట్రావర్సీ కింగ్ గా పేరు తెచ్చుకున్నారు. ప్రత్యేకించి పవన్ కల్యాణ్ పై విమర్శలు చేయడం ద్వారా కత్తి మహేశ్ పాపులర్ అయ్యారనే చెప్పాలి.



ఆ తర్వాత బిగ్ బాస్ లోనూ కంటెస్టెంట్ గా సెలక్ట్ కావడంతో కత్తి మహేశ్ కూడా సెలబ్రెటీ అయ్యాడు. అయితే తరచూ వివాదాల్లో ఉండే కత్తి మహేశ్ ఈసారి చాలా సున్నితమైన అంశంలో వివాదాస్పదుడయ్యాడు. మతపరమైన ప్రజల మనోభావాలు దెబ్బతినే విధంగా కామెంట్లు చేసి వార్తల్లోకి ఎక్కాడు. ఆయన ఈసారి చేసిందేమిటంటే.. హిందువుల ఆరాధ్య దైవం అయిన శ్రీరాముడిని ఉద్దేశించి మహేష్ కొన్ని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.



ఈ వ్యాఖ్యలతో కలత చెందిన ఓ వ్యక్తి.. పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కత్తి మహేశ్ పై కేసు నమోదైంది. హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు కత్తి మహేష్ మీద కేసు నమోదు చేశారు. హిందూ దేవుళ్లు, హిందూ మతాన్ని కించపరిచేలా మట్లాడిన కత్తి మహేష్‌పై చర్యలు తీసుకోవాలని నాంపల్లి పోలీసు స్టేషన్‌లో ఉమేష్‌ అనే వ్యక్తి ఫిర్యాదు చేశారు.



ఆ ఫిర్యాదును నాంపల్లి పోలీసులు సైబర్‌ క్రైమ్‌ పోలీసులకు ట్రాన్స్‌ఫర్‌ చేశారు. సైబర్‌ క్రైమ్‌ పోలీసులు కత్తి మహేష్‌పై కేసు నమోదు చేశారు. చూడాలి మరి ఈ కేసు చివరకు ఎన్ని మలుపులు తీసుకుంటుందో.. వివాదాలే ఇప్పుడు సరికొత్త పాపులారిటీకి కొలమానాలు అవుతున్నాయనడానికి ఈ కత్తి మహేశ్ ఓ ఉదాహరణగా చెప్పొచ్చు.



మరింత సమాచారం తెలుసుకోండి: