కరోనా ప్రపంచ దేశాలను గడగడలాడిస్తున్నా వైరస్. కరోనా వ్యాప్తి నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోమ్ అమలు చేసింది. ఉద్యోగులను వంతుల వారీగా పని విధానం అమలుకు నిర్ణయం తీసుకున్నారు. ఉన్నతాధికారులు మినహా మిగతా వారిని రెండు టీమ్ లుగా విభజించారు. గెజిటెడ్ అధికారులు మాత్రం విధులకు హాజరుకావాలని స్పష్టం చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. 

 

60 ఏళ్లు పైబడిన సలహాదారులు, చైర్ పర్సన్లు ఇంటి నుంచి పని చేయాలని ఆదేశాలు ఇచ్చారు. 50 ఏళ్లు పైబడి అనారోగ్యంతో బాధపడుతున్న ఉద్యోగులు ఇంటి నుంచే సేవలు అందించే అవకాశం కల్పించారు. ప్రభుత్వ ఉద్యోగులు మాదిరిగానే కాంట్రాక్ట్ ఉద్యోగులకు కూడా ఈ ఉత్తర్వులు వర్తిస్తాయి. ఉద్యోగులకు 9.30 గంటలు, 10 గంటలు, 10.30 గంటలకు వేర్వేరు షిఫ్ట్ లలో హాజరవుతారు. ఏప్రిల్ 4వరకు ఈ ఉత్తర్వులు అమల్లో ఉంటాయని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని తెలిపారు.

 

కరోనా భారత్ లోనూ విజృంభిస్తోంది. దేశంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 332కి చేరింది. నలుగురు చనిపోయారు. 22 మంది కరోనా బారి నుంచి కోలుకున్నారు. తెలంగాణలో కరోనా కేసుల సంఖ్య 21కి చేరింది. ఏపీలో 5 కరోనా కేసులు నమోదయ్యాయి. మన దేశంలో 22 రాష్ట్రాలకు మహమ్మారి విస్తరించింది. మహారాష్ట్రలో అత్యధికంగా 63 కరోనా కేసులు నమోదవడం ఆందోళనకు గురి చేస్తోంది.

 

రోజురోజుకు ప్రభావం పెంచుకుంటూ.. కరోనా వైరస్ తెలుగు ప్రజలను కూడా భయాందోళనకు గురి చేస్తుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 5కు చేరుకుంది. ఆంధ్రప్రదేశ్‌లో ఒక్కరోజే ఇద్దరికి కరోనా పాజిటివ్ రావడంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. ఏపీలో ఇప్పటికే నెల్లూరు, ప్రకాశం, విశాఖ జిల్లాల్లో ఒక్కొక్కరు కరోనా బాధితులు ఉండగా.. లేటెస్ట్‌గా రాజమహేంద్రవరం, విజయవాడల్లో ఒక్కొక్కరికి కరోనా వైరస్ సోకినట్టు నిర్ధారణ అయ్యింది.

మరింత సమాచారం తెలుసుకోండి: