గుజరాత్ రాష్ట్రంలో దారుణ ఘటన చోటు చేసుకుంది. స్నేహితుని భార్యను అతిగా పొగిడిన యువకుడు దారుణ హత్యకు గురయ్యాడు. భార్యను సూపర్ అంటూ స్నేహితుడు పొగడటంతో తీవ్ర ఆగహానికి గురైన భర్త ఆ వ్యక్తిని దారుణంగా హత్య చేశాడు. ఆ తరువాత అతని శవాన్ని తుప్పల్లో పడేశాడు. పొలం చూడటానికి వెళ్లిన కొడుకు ఇంటికి రాకపోవడంతో యువకుని తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు విచారణ చేయగా దర్యాప్తులో షాకింగ్ విషయాలు వెలుగులోకి వచ్చాయి. 
 
పూర్తి వివరాలలోకి వెళితే గుజరాత్ రాష్ట్రంలోని రాజ్‌కోట్ సమీపంలోని ఖజుర్ది గ్రామానికి నీలం మావి అనే వ్యక్తి సంజయ్ రంగా పొలం చూడటానికి వెళ్లాడు. అదే గ్రామంలో అతని స్నేహితుడు రాకేష్ కూడా ఉన్నాడు. పొలం చూడటానికి వచ్చిన మావి అతని స్నేహితుని ఇంటికి వెళ్లి కలిశాడు. మావి రాకేష్ భార్యపై ప్రశంసల వర్షం కురిపించాడు. పదేపదే పొగుడుతూ ఉండటంతో రాకేష్ కు కోపం వచ్చింది. 
 
కోపం వచ్చినా స్నేహితుడిని ఏమీ అనలేక రాకేష్ సైలెంట్ అయ్యాడు. ఆ తర్వాత బస్టాండ్ లో డ్రాప్ చేస్తానని చెప్పి రాకేష్ మావిని బైక్ పై ఎక్కించుకున్నాడు. మార్గమధ్యంలో ఎవరూ లేని ప్రదేశంలో బైక్ ను ఆపాడు. తన వెంట తెచ్చుకున్న తాడును మావి మెడకు బిగించి ఊపిరాడకుండా చేసి మావిని చంపేశాడు. శవాన్ని ఏం చేయాలో అర్థం కాక అక్కడే ఉన్న తుప్పల్లో పడేశాడు. 
 
మావి కుటుంబ సభ్యులు బయటకు వెళ్లిన మావి ఇంటికి రాకపోవడంతో పోలీసులను ఆశ్రయించారు. పోలీసుల విచారణలో మావి రాకేష్ ను కలిసినట్లు తెలిసింది. పోలీసులు రాకేష్ ను అదుపులోకి తీసుకొని విచారించగా అసలు నిజం వెలుగులోకి వచ్చింది. భార్యను పదేపదే పొగడటంతో హత్య చేశానని రాకేష్ చెప్పడంతో షాక్ అవ్వడం పోలీసుల వంతయింది. పోలీసులు రాకేష్ ను అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ కు తరలించారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: