తెలంగాణ ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి... టిఆర్ఎస్ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు అయిన కేటీఆర్ రాజకీయాల్లో తనదైన శైలిలో సమన్వయం చేస్తూ దూసుకుపోతున్నారు అన్న విషయం తెలిసిందే. అయితే కేటీఆర్ సోషల్ మీడియాలో కూడా ఎప్పుడూ యాక్టివ్ గా ఉంటారు. సోషల్ మీడియా లో వివిధ వీడియోలను లేదా పోస్టులను చేస్తూ.. అవగాహన కల్పించడంతో పాటు కొన్ని కొన్ని సార్లు కొన్ని ఫన్నీ  పోస్టులు కూడా పెడతారు. ఇక కేటీఆర్ ఏదైనా పోస్టు పెట్టారు అంటే అది క్షణాల్లో వైరల్ గా మారిపోయింది. 

 


 తాజాగా ఐటీశాఖ మంత్రి కేటీఆర్ పెట్టిన పోస్ట్ కాస్త  సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది. వారంతంలో లాగ్ డౌన్  ఎత్తివేస్తూ ఉండటం కారణంగా ఆ తర్వాత అందరి కార్యకలాపాలు ఇలా ఉండొచ్చు అంటూ ఊహ జనకంగా తెలంగాణ మంత్రి కేటీఆర్ ట్విట్టర్లో స్పందించారు.ఇలా ప్రతి ఒక్కరూ  తమలో తాము ఇలా ఆలోచించే అవకాశం లేకపోలేదు అంటూ వివరించాడు ఐటీశాఖ మంత్రి కేటీఆర్. కాగా ప్రస్తుతం ఐటీశాఖ మంత్రి కేటీఆర్ పెట్టిన ట్విట్  సోషల్ మీడియా లో వైరల్ గా మారిపోయింది. 

 

 ఇక్కడ ఎవరు సజీవంగా బయటపడే పరిస్థితి లేనందున మరో ఆలోచన దిశగా మిమ్మల్ని మీరు నడిపించు కోకండి... మీ ఇష్టం వచ్చినట్టు చేసేయండి.. రుచికరమైన ఆహారాన్ని తినండి .. సూర్యరశ్మి ఆస్వాదిస్తూ హాయిగా నడక ప్రారంభించండి. సముద్రంలో దూకండి.. హృదయాన్ని ఒక పెన్నిధి పొదిలి పట్టుకు తిరుగుతున్నామన్న  సత్యాన్ని అందరికీ చాటి చెప్పండి. అప్పుడప్పుడు సిల్లీ గా ఉండండి. కొంచెం దయ తో ని వ్యవహరించండి. మరికొంచెం విచిత్రంగానూ ఉండండి. ఇంకేదీ వదిలి పెట్టేందుకు సమయం లేదు. అన్ని  ఇప్పుడే చేసేయండి... అంటూ ఒక ఫన్నీ ట్వీట్ చేశారు మంత్రి కేటీఆర్. దీనిపైన నెటిజన్లు  కూడా ఫన్నీగానే స్పందిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: