ప్రస్తుతం జిహెచ్ఎంసి ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కావడంతో తెలంగాణ రాజకీయాలు హాట్ హాట్ గా మారిపోయాయి అన్న విషయం తెలిసిందే. జిహెచ్ఎంసి ఎన్నికల్లో విజయం సాధించేందుకు అన్ని పార్టీల అభ్యర్థులు ఎంతో వ్యూహాత్మకంగా పావులు కదుపుతున్నారు. ఇక కొందరు అభ్యర్థులు ఎంతో ముమ్మర ప్రచారం చేపడుతూ ప్రస్తుతం ఓటర్లను ఆకట్టుకునే పనిలో పడ్డారు అన్న విషయం తెలిసిందే. ఇక అన్ని డివిజన్లలో కూడా అభ్యర్థులు ముమ్మర ప్రచారం చేపడుతూ తమను గెలిపిస్తే అభివృద్ధి ని పరుగులు పెట్టిస్తాం అంటూ హామీల వర్షం కురిపిస్తున్నారు. అదే సమయంలో ఆయా పార్టీల పెద్దలు కూడా రంగంలోకి దిగి డివిజన్ల వారీగా అభ్యర్థులకు మద్దతు తెలుపుతున్నారు.



 కాగా ఇటీవలే కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలోని జగద్గిరిగుట్ట డివిజన్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గూడా వరమ్మ ఐలయ్య గౌడ్ ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఓటర్లను ఆకట్టుకునే విధంగా ఆమె ఇంటింటి ప్రచారం నిర్వహించారు.  ఈ క్రమంలోనే పలు కాలనీలలో ర్యాలీ నిర్వహించారు జగదీర్ గుట్ట డివిజన్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గూడా వరమ్మ  ఐలయ్య గౌడ్. సందర్భంగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కూడా వరమ్మ ఐలయ్య  గౌడ్ ప్రచారంలో మద్దతుగా కాంగ్రెస్ పార్టీ మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్ పాల్గొన్నారు.  ఈ సందర్భంగా మాట్లాడిన మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్ తెలంగాణ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు




 గత  జిహెచ్ఎంసి ఎన్నికల్లో టిఆర్ఎస్ పార్టీ ఇచ్చిన హామీలు అన్నింటిని కూడా ఇప్పటికి కూడా నెరవేర్చలేదని.. నిరుపేదలకు డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు కట్టిస్తామని టీఆర్ఎస్ హామీ ఇవ్వడం వల్లే ప్రజలందరూ టీఆర్ఎస్ పై నమ్మకంతో ఓటు వేశారని.. కానీ  ప్రజలను నమ్మించి టిఆర్ఎస్ మోసం చేసింది అంటూ వ్యాఖ్యానించారు ముఖ్యంగా జగద్గిరిగుట్టలో  గత ఐదేళ్లలో టిఆర్ఎస్ చేసిన అభివృద్ధి ఎక్కడా కనిపించడం లేదని... ఇక డివిజన్ లో అభివృద్ధి జరగాలి అంటే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కూడా గూడ వరమ్మ ఐలయ్య  గౌడ్ కి మీ అమూల్యమైన ఓటు వేసి గెలిపించాలని అంటూ ఈ సందర్భంగా డివిజన్ ఓటర్లందరికీ కోరారు మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్.

మరింత సమాచారం తెలుసుకోండి: