అక్రమ సంబంధాలు ఎన్నో కాపురాలను కూల్చే సాయి అన్న విషయం తెలిసిందే. అంతే కాదు ఎంతోమంది ప్రాణాలు పోవడానికి కూడా అక్రమ సంబంధాలు కారణం అయ్యాయి అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. అయితే అంతా తెలిసినప్పటికీ కూడా ఈ మధ్యకాలంలో ఎంతోమంది అక్రమ సంబంధాల వైపు ఎక్కువగా మొగ్గు చూపుతూ ఉండడం గమనార్హం.  రోజురోజుకు అక్రమ సంబంధాలను పంపు పెరిగిపోతున్న దారుణ ఘటన లు ఎక్కువ అవుతున్నాయి. ముఖ్యంగా దాంపత్య జీవితంలో అల్లకల్లోలం సృష్టిస్తున్నాయి వివాహేతర సంబంధాలు.


 మొదట క్షణకాల సుఖం కోసం ప్రారంభమయ్యే ఈ అక్రమ సంబంధాలు చివరికి ఎక్కడ వరకు దారి తీస్తాయి అన్నది కూడా తెలియని స్థాయికి దిగజారి పోతున్నాయి.  ఇక్కడ ఇలాంటి ఓ వివాహేతర సంబంధమే తెరమీదికి వచ్చింది. స్కూల్లో సైన్స్ టీచర్ గా పని చేస్తున్న మహిళ లెక్కల మాస్టారు తో అక్రమ సంబంధానికి తెరలేపింది. అయితే ఓ రోజు ఈ విషయం లెక్కల మాస్టారు భార్యకు తెలియడంతో ఇద్దరినీ నిలదీయగా చివరికి ఇద్దరూ కలిసి.. లెక్కల మాస్టారు భార్య ప్రాణం తీశారు ఈ ఘటన బీహార్లోని బెగుసరాయ్ లో చోటుచేసుకుంది.



 రామ్ లాల్  అనే వ్యక్తి తన భార్య సుమతి తో కలిసి నివసిస్తున్నాడు. గత మూడేళ్లుగా ఒక స్కూల్లో లెక్కల మాస్టర్ గా పని చేస్తుండగా ఇక అక్కడ అదే స్కూల్ లో పనిచేస్తున్న సైన్స్ టీచర్ దామినితో అతనికి పరిచయం ఏర్పడింది. ఈ క్రమంలోనే  పరిచయం కాస్తా అక్రమ సంబంధానికి దారితీసింది.  కరోనా  వైరస్ కారణంగా స్కూల్ మూతపడడంతో వీరిద్దరి మధ్య చాలా గ్యాప్ వచ్చేసింది. అయితే ఈ మధ్య కాలంలోస్కూల్ అని చెప్పి ఇద్దరు బయటికి వెళ్లి రాసలీలల్లో మునిగి తేలారు. అయితే ఈ విషయం ఆ నోటా ఈ నోటా పడి చివరికి లెక్కల మాస్టారు  భార్య సుమతికి తెలిసింది. అయితే ఓరోజు ప్రియురాలితో భర్త ఏకాంతంగా ఉన్న సమయంలో రెడ్ హ్యాండెడ్  గా పట్టుకున్న భార్య నిలదీయడంతో ఇక గొడవ పెద్దది అవుతుందని భావించిన భర్త  భార్య గొంతు నులిమి చంపేశాడు తర్వాత మృతదేహాన్ని చీర కట్టి ఉరి వేసుకున్నట్లు చిత్రీకరించాడు.  మృతదేహంపై దెబ్బలు కనిపించడంతో రంగంలోకి దిగిన పోలీసులు భర్తను  అదుపులోకి తీసుకుని విచారించగా అసలు విషయం బయటపడింది.

మరింత సమాచారం తెలుసుకోండి: