తెలంగాణ నగారా సమితి వ్యవస్థాపకుడు నాగం జనార్దనరెడ్డి ఆచితూచి నిర్ణయాలు తీసుకుంటున్నట్టే కనిపిస్తోంది. టీఆర్ఎస్ లో నాగం చేరుతారని వస్తున్న వార్తల్ని ఆయన కొట్టిపారేశారు. టీఆర్ఎస్ లో చేరబోనని నాగం చెప్పకనే చెప్పారు. కాంగ్రెస్‌తో కలిసిపోయే పార్టీలో చేరబోనని ఆయన స్పష్టం చేశారు. బీజేపీలో కూడా చేరడంలేదన్నారు. తెలంగాణ సాధన కోసం బీజేపీ సహా అన్నిపక్షాలతో పనిచేస్తానని నాగం తెలిపారు. ఈనెల 23 నుంచి తెలంగాణ వ్యాప్తంగా భరోసా యాత్ర చేయనున్నట్లు నాగం వెల్లడించారు. ఈ భరోసాయాత్రకు బీజేపీ సపోర్ట్ ఇస్తోంది. నాగంను తమ పార్టీలోకి ఆహ్వానించలేదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి తెలిపారు. కాంగ్రెస్ మోసాలను బయటపెట్టే శక్తులు కలిసిరావాలన్నారు. మొత్తానికి నాగం ఇప్పుడే టీఆర్ఎస్ తీర్థం పుచ్చుకునే అవకాశాలు కనిపించడం లేదు. 

మరింత సమాచారం తెలుసుకోండి: