ప్రస్తుతం ప్రపంచ దేశాలను వెంటాడుతూ వేధిస్తున్న కరోనా రోజు రోజుకీ తన ఉగ్రరూపాన్ని మరింత పెంచుతూ ప్రజలను భయాందోళనలకు గురిచేస్తోంది. అసలు కరోనా గురించి ఆలోచించకుండా మరిచిపోవడానికి ఎంత ప్రయత్నించినా అది సాధ్యం కావడం లేదు. లక్షల్లో పెరుగుతున్న కేసులు సంచలనం సృష్టిస్తూ కరోనా మరణాలు జనాలను భయపెడుతున్నాయి. వైరస్ ప్రభావానికి అద్దం పడుతున్నాయి. మరి ఇలాంటి విషమ పరిస్థితులలో దేశంలో మరో వైపు వైద్యపరమైన ఇబ్బందులు కొంత కలవరపెడుతున్నాయి. వ్యాక్సిన్ అవసరమైనంత స్థాయిలో పంపిణీ అవడంలేదు, కరోనా పరీక్షలు భారీగా జరగడంలేదు, హాస్పిటల్ బెడ్స్ దొరకడం గగనంగా మారింది. వైరస్ సోకి తీవ్రత పెరిగితే ఆక్సిజన్ సిలిండర్లు దొరకడం లేదు. వైరస్ ప్రభావం పెరిగినప్పుడు కావాల్సిన రెండేసివెర్ ఇంజక్షన్ అందుబాటులో లేవు. ఇలా ఎన్నో సమస్యలు మన ముందున్నాయి.

ఓ వైపు అత్యవసరమైతే తప్ప.. సాధారణ  లక్షణాలకు ఇంట్లోనే చికిత్స తీసుకోవాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు.
కరోనా సోకితే చాలా మంది సాధారణ లక్షణాలతోనే బయటపడుతున్నప్పటికీ మరి కొందరిలో దీని ప్రభావం ఎక్కువగా ఉంటోంది. కరోనా శరీరంలోని అన్ని అవయవాలపై దాడి చేస్తోంది. ముఖ్యంగా శ్వాసకోశ వ్యవస్థను క్షీణింపచేసి మనిషి ప్రాణాలను ప్రమాదంలో పడేస్తోంది. అయితే కరోనా సోకిన వారిలో రెండు లక్షణాలు ముఖ్యంగా ప్రమాదాన్ని సూచిస్తాయి. ఆ తర్వాత వాటి నుండి కోలుకోవడానికి చాలా కాలం పడుతుందని అంటున్నారు వైద్యనిపుణులు. కరోనా సోకిన  కొందరిలో జ్వరం, పొడి దగ్గు, జలుబు సాధారణ లక్షణాలతో పాటుగా తీవ్రంగా కడుపునొప్పి మరియు కొందరిలో విరోచనాలు వంటి సమస్యలు తలెత్తుతున్నాయి.

సాధారణ లక్షణాలు ఉన్న కరోనా రోగులు త్వరగానే కోలుకుంటున్నారు కానీ.. కడుపు నొప్పి మరియు విరోచనాలు, ఈ రెండు లక్షణాలు ఉన్న వారు మాత్రం కరోనా నుండి కోలుకోవడానికి ఎక్కువ కాలం పడుతున్నట్లు కొన్ని నివేదికలు చెబుతున్నాయి. అలాగే సాధారణ సమస్యలతో పాటు ..ఈ రెండు సమస్యలు ఉండే వారిలో ఎక్కువగా ప్రమాద స్థాయి పెరుగుతుందని గమనించినట్లు చెబుతున్నారు. ఇలాంటి వారు అశ్రద్ధ చేయకుండా సమస్య పెరిగితే వెంటనే డాక్టర్ని సంప్రదించాలని సూచిస్తున్నారు. కాబట్టి కరోనా వచ్చి ఇబ్బంది పడడం కన్నా, అసలు కరోనా వైరస్ రాకుండా జాగ్రత్త పడితే ఏ గొడవా ఉండదని  మరి కొందరు చెబుతున్నారు.  

మరింత సమాచారం తెలుసుకోండి: