ఇటీవలే ఏపీ అసెంబ్లీ లో చంద్రబాబు సతీమణి పై అసభ్య వ్యాఖ్యలు చేశారంటూ చంద్రబాబు ఆరోపించడం ఏకంగా అసెంబ్లీ వేదికగా కంటతడి పెట్టిన విషయం తెలిసిందే. అయితే ఇక సీఎం అయ్యేంతవరకు మళ్లీ అసెంబ్లీలో అడుగు పెట్టబోయే ప్రసక్తి లేదు అంటూ శపథం చేశారు చంద్రబాబు. ఇక అసెంబ్లీ బయట మీడియాతో మాట్లాడుతున్న సమయంలో కూడా కూడా చిన్న పిల్లాడిలా ఏడ్చారు. అయితే చంద్రబాబు లాంటి ఒక సీనియర్ రాజకీయ నాయకుడు కంటతడి పెట్టుకోవడంఅందరి మనసు కదిలించింది.  అంతే కాదు చంద్రబాబు సతీమణి పై అసభ్య వ్యాఖ్యలు చేయటంపై  అటు నందమూరి కుటుంబం కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది.



 ఈ ఘటన తర్వాత స్పందించిన నందమూరి బాలకృష్ణ మా ఇంటి ఆడవాళ్ళ   జోలికి వస్తే ఊరుకునే ప్రసక్తే లేదు అంటూ హెచ్చరికలు జారీ చేశారు. ఇక అటు టీడీపీ శ్రేణులు కూడా ఎంతోమంది వైసీపీ నేతలు చేసిన వ్యాఖ్యలను తప్పు పడుతూ నిరసనలు ర్యాలీలు కూడా నిర్వహించారు అన్న విషయం తెలిసిందే. అయితే ఈ క్రమంలోనే అటు జూనియర్ ఎన్టీఆర్ కూడా ఈ ఘటనపై స్పందించడం గమనార్హం. ఆడవాళ్ళ పై అనుచిత వ్యాఖ్యలు చేయడం ఏమాత్రం సరికాదని.. పాలన అనేది మెచ్చుకునే విధంగా ఉండాలి కానీ నొచ్చుకునే విధంగా ఉండకూడదు అంటూ వ్యాఖ్యలు చేశారు.



 జూనియర్ ఎన్టీఆర్ చేసిన వ్యాఖ్యలపై అటు టీడీపీ నేతలు వర్ల రామయ్య సహ మరికొంతమంది కూడా తప్పు పడుతూ ఉండడం గమనార్హం. ఇంటి ఆడపిల్ల పై అసభ్యంగా మాట్లాడితే జూనియర్ ఎన్టీఆర్ మాత్రం చాగంటి లా నీతివాక్యాలు చెప్పారు అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. జూనియర్ ఎన్టీఆర్ నందమూరి ఫ్యామిలీతో కూర్చుని స్టేట్మెంట్ ఇచ్చి ఉంటే బాగుండేది అని అన్నారు.  అయితే ప్రస్తుతం వినిపిస్తున్న టాక్ ప్రకారం నందమూరి ఫ్యామిలీ నుంచి జూనియర్ ఎన్టీఆర్ కు పిలుపు రాలేదని.. అందుకే ఫ్యామిలీతో కలిసి విదేశీ టూర్ కి వెళ్ళిన జూనియర్ ఎన్టీఆర్ అక్కడి నుంచే ఈ ఘటనపై స్పందించారు అని విశ్లేషకులు అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: