చాలా తక్కువ ఖర్చులో ఎక్కువ దూరం ప్రయాణించవచ్చు, అలాగే ఇంధన వినియోగం తగ్గడంతో కాలుష్యాన్ని కూడా తగ్గించవచ్చు. ఇవన్నీ కూడా విద్యుత్‌ ఆధారిత వాహనాలతో కలిగే లాభాలు.అందుకే ప్రభుత్వాలు సైతం ఈ ఎలక్ట్రిక్‌ వాహనాల తయారీకి పెద్ద పీట వేస్తూ వచ్చాయి, ఇంకా సబ్సిడీలు అందిస్తున్నాయి. అయితే పలు సంఘటనలు చూస్తుంటే ఎలక్ట్రిక్‌ బైక్స్‌ ఎంత వరకు సురక్షితమన్న ప్రశ్నలు చాలా తలెత్తుతున్నాయి. ఇటీవల పేలుతోన్న బైక్స్‌ జనాలను భయంతో హడలెత్తిస్తున్నాయి. తాజాగా హైదరాబాద్లో రెండు పేలాయి.ఇక హైదరాబాద్‌లో ఒకే రోజు రెండు ఎలక్ట్రిక్‌ బైక్స్‌ పేలడం స్థానికంగా కలకలం రేపింది.పూర్తి వివరాల్లోకి వెళితే.. హైదరాబాద్‌ కుషాయిగూడలోని సాయినగర్‌లో సోమవారం నాడు ఛార్జింగ్ పెట్టిన రెండు బైక్స్‌ ఒక్కసారిగా పేలిపోయాయి.ఇక ఈ పేలుడు ధాటికి రెండు బైక్స్‌ కూడా తుక్కుతుక్కైపోయాయి. కనీసం బండి ఆనవాలు కూడా కనిపించకుండా అవి పూర్తిగా ధగ్దమయ్యాయి. ఇక బైక్ ఛార్జింగ్ అవుతుండగా ఈ ప్రమాదం జరిగింది. ఒకేరోజు రెండు బైక్స్‌ పేలడంతో స్థానికులు చాలా భయాందోళనకు గురవుతున్నారు. 


బైక్ బ్యాటరీలో మొదలైన మంటలు ఎలక్ట్రికల్‌ ప్యానెల్‌ బోర్డుకు అంటుకున్నాయి. అయితే బైక్‌లు పేలిన సమయంలో దగ్గర్లో ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం అనేది తప్పింది. దీంతో రంగంలోకి దిగిన కుషాయి గూడ పోలీసులు కేసు నమోదు చేసుకొని, విచారణని ప్రారంభించారు.ఇక ఇదిలా ఉంటే ఎలక్ట్రిక్‌ బైక్స్‌ పనితీరుపై కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే రంగంలోకి దిగిన విషయం తెలిసిందే. కేంద్ర రోడ్డు ఇంకా రవాణా మంత్రిత్వ శాఖ ఎలక్ట్రిక్‌ బైక్‌ ప్రమాదాలపై నిపుణుల కమిటీని నియమించింది. నాసిరకం బ్యాటరీలతో బైక్‌లను విక్రయించిన మూడు ఈవీ తయారీ కంపెనీలపై భారీ జరిమానా అనేది వేయాలని నిపుణుల కమిటీ సిఫార్సు చేసింది. దీనికి అనుగుణంగానే సదరు ఈవీ కంపెనీలకు కేంద్ర ప్రభుత్వం భారీ జరిమాన విధించిన విషయం తెలిసిందే..

మరింత సమాచారం తెలుసుకోండి: