హైదరాబాద్ నగరవాసులకు ట్రాఫిక్ వల్ల కలిగే ఇబ్బందులు గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అలాంటి ఇబ్బందులు ఏవి లేకుండా చేయడం కోసం ఎస్.ఆర్.డి.పి ద్వారా చేపట్టిన పలు పనులు దశల వారిగా పూర్తవుతున్నాయి.ఇక ఈ నేపథ్యంలో ఎల్బీనగర్ కుడివైపు గల మరో ఫ్లై ఓవర్ నిర్మాణ పనులు పూర్తయ్యి ప్రారంభోత్సవానికి రెడీగా ఉంది. ఈ ఫ్లై ఓవర్‌ని రాష్ట్ర మున్సిపల్ పరిపాలన, ఐటి ఇంకా అలాగే పరిశ్రమలు శాఖామంత్రి కేటిఆర్ త్వరలో ప్రారంభించనున్నారు.ఎన్నికల కోడ్ కారణంగా ఆలస్యమైన ఫ్లై ఓవర్ మార్చి చివరి నాటికి స్టార్ట్ కానుంది. నగరంలో రోజురోజుకు పెరుగుతున్న ట్రాఫిక్ సమస్యను తగ్గించేందుకు జిహెచ్ఎంసి ప్రత్యేకంగా చొరవ చూపడం జరిగింది.ఎస్.ఆర్.డి.పి ద్వారా చేపట్టిన 47 పనులలో ఇప్పటిదాకా మొత్తం 35 పనులు పూర్తి కాగా వాటిలో ఎల్బీనగర్ ఆర్.హెచ్.ఎస్ ఫ్లైఓవర్ 19గా అందుబాటులోకి రానున్నది.


ఇక ఎస్.ఆర్.డి.పి ద్వారా చేపట్టిన 47 పనులు కాగా జిహెచ్ఎంసి నిధులతో చేపట్టిన పనులలో మొత్తం 32 పనులు పూర్తయ్యాయి. మిగతా శాఖలకు సంబంధించిన ఆరు పనులలో మూడు పనులు పూర్తి కాగా మరో మూడు వివిధ ప్రగతి దశలో కలవు. గోల్నాక నుండి అంబర్ పెట్ దాకా ఫ్లైఓవర్ జాతీయ రహదారుల శాఖ ద్వారా ఉప్పల్ జంక్షన్ నుండి సి.పి.ఆర్.ఐ (మేడిపల్లి) దాకా ఫ్లైఓవర్, ఆరాంఘర్ నుండి శంషాబాద్ దాకా చేపట్టనున్న ఈ రెండు 6 లైన్ల ఫ్లైఓవర్లను రోడ్లు భవనాల శాఖ ద్వారా చేపట్టారు.ఆ పనులు సత్వరమే పూర్తి చేసేందుకు జిహెచ్ఎంసి ఎంతగానో కృషి చేస్తున్నది.జి హెచ్ ఏం సి కి సంభందించిన మొత్తం రూ. 2335.42 కోట్ల విలువ గల వివిధ రకాల10 పనులలో ఫ్లై ఓవర్ లు, ఇతర పనులన్నింటినీ ఈ సంవత్సరం డిసెంబర్ నెల నాటికి పూర్తి చేసేందుకు అవసరమైన అన్ని రకాల చర్యలని తీసుకోవడం జరిగినది.

మరింత సమాచారం తెలుసుకోండి: