ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలు చాలా రసవత్తరంగా కొనసాగుతున్నాయి. మొత్తం 175 నియోజకవర్గాల్లో పిఠాపురం నియోజకవర్గం చాలా ఆసక్తికరంగా మారింది. ఈ నియోజకవర్గం నుంచి పోటీ చేసే అభ్యర్థులంతా రాష్ట్రస్థాయిలో మంచి పేరున్న లీడర్లు. ఇందులో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూటమిలో భాగంగా పోటీ చేస్తున్నారు. అలాగే వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి  వంగ గీత పోటీలో ఉన్నారు. అయితే వీరిద్దరి మధ్య  హోరాహోరీగా నువ్వా నేనా అనే విధంగా పోరు నడుస్తున్న తరుణంలో  మరో కొత్త పేరు అనూహ్యంగా బయటకు వచ్చింది. ఆ కొత్త అభ్యర్థి ఎవరయ్యా అంటే తెలుగు బిగ్ బాస్ షో లో మంచి గుర్తింపు సాధించిన నటి  ట్రాన్స్ జెండర్ తమన్నా సింహాద్రి.

  ఈమె భారత చైతన్య యువజన పార్టీ నుంచి బరిలోకి దిగుతున్నారు. ఈమె గతంలో కూడా మంగళగిరి నియోజకవర్గంలో నారా లోకేష్ పై పోటీ చేశారు.  అంతేకాకుండా ఈమె గతంలో జనసేన పార్టీలో పని చేశారు. ఆ తర్వాత  మంగళగిరి టికెట్ ఆశించి బంగపడ్డారు. సీటు ఇవ్వకపోవడంతో ఇండిపెండెంట్ గా పోటీ చేసి, ఎన్నికల తర్వాత పవన్ తో కలిసి పోయారు.  కానీ ఎప్పుడైతే జనసేన పార్టీ టిడిపితో పొత్తు పెట్టుకుందో అప్పటినుంచి  తమన్నా  పవన్ పై  వ్యతిరేక బాణాలు ఎక్కు పెట్టడం మొదలుపెట్టింది.
 
చివరికి ఏకంగా ఆయన పోటీ చేసే నియోజకవర్గం పిఠాపురం నుంచి  బరిలో నిలిచింది.  మరి ఈమె పోటీ ఏ అభ్యర్థికి డామేజ్ అవుతుంది?ఎవరికి ప్లస్ అవుతుంది అనే విషయాల్లోకి వెళ్తే.. పవన్ కళ్యాణ్ ఒక సెలబ్రిటీ, తమన్నా కూడా సెలబ్రిటీ  గానే గుర్తింపు పొందింది. అంతేకాకుండా జనసేనలో పనిచేసిన అనుభవం ఉంది. కాబట్టి పిఠాపురంలో  పవన్ కళ్యాణ్ కు పడే కొన్ని ఓట్లు  క్రాస్ అయ్యి తమన్నా కు పడితే మాత్రం, అక్కడ వైసీపీ అభ్యర్థికి లాభం చేకూరే అవకాశం ఎక్కువగా ఉంటుందని, పవన్ కళ్యాణ్ కు మైనస్ అవుతుందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: