రాయలసీమలో హిందూపురం నియోజకవర్గం టిడిపికి కంచుకోట.. అక్కడ ప్రజలు కూడా టిడిపి పార్టీని ఎక్కువగా ఆదరిస్తూ ఉంటారు. గత రెండుసార్లు బాలకృష్ణ అక్కడ పోటీ చేసి మంచి విజయాన్ని అందుకున్నారు. ఈసారి కూడా ఎమ్మెల్యేగా పోటీ చేసి హ్యాట్రిక్ సాధిస్తానంటూ బాలకృష్ణ ఇటీవలే హిందూపురంలో ఒక సమావేశంలో మాట్లాడారు. ముఖ్యంగా రాష్ట్రంలో సీఎం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ ను నాశనం చేస్తున్నారని.. ప్రశాంతంగా ఉన్న రాయలసీమలో రక్తపాతాన్ని సృష్టిస్తున్నారని.. మద్యపాన నిషేధం అమలు చేయకుండా.. సరి కొత్త బ్రాండ్లను తీసుకువచ్చి ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నట్లుగా వెల్లడించారు బాలయ్య.


నిన్నటి రోజున అక్కడ స్థానిక నేతలతో బిజెపి టి,డిపి, జనసేన పార్టీలో ఉమ్మడి కార్యచరణలో భాగంగా విస్తృత సమావేశాన్ని ఏర్పాటు చేసిన బాలయ్య మాట్లాడారు. వైసిపి పాలనలో రాష్ట్రం మరో పదేడ్లు వెనక్కి వెళ్లిపోయిందని.. ఇలాంటి రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలి అంటే మళ్ళీ చంద్రబాబు నాయుడు ద్వారానే అది సాధ్యమవుతుందంటూ బాలయ్య వెల్లడించారు.  హిందూపురం అసెంబ్లీ స్థానానికి మూడవసారిగా తాను ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నానని.. ఈ హ్యాట్రిక్ ని ఎవరు ఆపలేరు అంటూ కూడా తెలియజేశారు.

త్వరలో జరిగేటువంటి ఎన్నికలు ఒక మహా సంగ్రామం వంటివి... కూటమిలోని నాయకులు,  కార్యకర్తలు చాలా కష్టపడి అభ్యర్థులను గెలిపించాలని.. నా అక్క చెల్లెమ్మలు అంటూ తన సొంత చెల్లికి అన్యాయం చేశారని బాలయ్య తెలియజేశారు.. అలాగే హిందూపురం పార్లమెంట్ అభ్యర్థి బి.కె పార్థసారథి,  జనసేన పార్టీ నాయకులు వరుణ్ ఆకుల ఉమేష్.. తదితర నేతలు సైతం ఈ సభలో పాల్గొన్నారు. బాలయ్య చేసిన కామెంట్స్అక్కడ కార్యకర్తలకు మంచి ఉత్సాహాన్ని తీసుకువస్తోంది. అంతేకాకుండా గత కొన్ని ఏళ్లుగా టిడిపి పార్టీ హిందూపురంలో పూర్తిస్థాయిగా గెలుస్తూనే ఉంది. ఈసారి కూడా బాలయ్య ను అక్కడి ప్రజలు గెలిపిస్తారని నమ్మకం పూర్తిగా ఉన్నది. బాలయ్య చేసిన అభివృద్ధి పనులు అక్కడ ఆయనను గెలిపించేకి సహాయపడుతున్నాయని తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: