సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న వేళ బీజేపీ పార్టీ సంకల్ప పత్రం అనే పేరుతో తమ మేనిఫెస్టోని గడిచిన కొన్ని నిమిషాల క్రితం విడుదల చేశారు.. ఢిల్లీలో పార్టీ కార్యాలయంలో ప్రధాన మోడీ.. బిజెపి పార్టీ జాతీయ అధ్యక్షుడు జేసీ నడ్డా, అలాగే కేంద్ర మంత్రులు అయిన అమిత్ షా, నిర్మలా సీతారామన్,  రాజ్నాథ్ సింగ్ ఈ మేనిఫెస్టోని ఆవిష్కరించారు. ముఖ్యంగా మోడీ గ్యారెంటీ పేరుతో 2047 నాటికి వికసిత్ భారత్ ధీమాతో రూపొందించారు. దాదాపుగా 27 మంది సభ్యుల కమిటీ నేతృత్వంలో ఈ మేనిఫెస్టోని రూపొందించినట్లు తెలుస్తోంది.


మేనిఫెస్టో కోసం దాదాపుగా 15 లక్షల మంది సలహాలను కూడా పరిశీలించినట్లు బిజెపి నేతలు తెలియజేస్తున్నారు. ముఖ్యంగా మహిళలు, యువత, రైతులు, పేదలు దేశ ప్రగతి అజెండా గానే ఈ మేనిఫెస్టో రూపొందించినట్లు బిజెపి వర్గాల నుంచి నేతలు తెలియజేస్తున్నారు. ముఖ్యంగా మేనిఫెస్టో లోని 14 అంశాలను కూడా చేర్చారు.. అందులో సురక్షిత్ భారత్, విశ్వ బంధు, గ్లోబల్ మ్యానుఫ్యాక్చరింగ్ హబ్, సాంస్కృతిక వికాసం, ఈస్ ఆఫ్ లివింగ్, సమృద్ధ భారత్, స్వస్థ భారత్, ప్రపంచ స్థాయి మౌలిక వసతులు, క్రీడా వికాసం, అభివృద్ధి, సాంకేతిక వికాసం, సుస్థిర భారత్ వంటివి ఉన్నాయట.


బిజెపి పార్టీలో రిలీజ్ చేసిన మేనిఫెస్టోలో కీలక అంశాల విషయానికి వస్తే..

1). ముఖ్యంగా 70 ఏళ్ల పైబడిన వృద్ధులకు ఆయుష్మాన్ భారత్ లో భాగంగా రూ .5లక్షల వరకు ఉచిత వైద్యాన్ని అందిస్తారట.
2). మరో 5 ఏళ్ల పాటు ఉచిత రేషన్ బియ్యం.
3). పైప్ లైన్ ద్వారా ఇంటింటికీ వంట గ్యాస్ కనెక్షన్.
4). మూడు కోట్ల ఇళ్ల నిర్మాణానికి శ్రీకారం.
5). దివ్యాంగులకు ప్రత్యేక అవసరాలకు అనుగుణంగా ఇంటి నిర్మాణం అలాగే ట్రాన్స్ జెండర్లకు  సైతం ఆయుష్మాన్ భారత్..
6). ముద్ర రుణాల పరిమితిని రూ .20 లక్షల వరకు పెంపు.

వీటితోపాటు ఉపాధి హామీ, మహిళా రిజర్వేషన్లు అమలు, వ్యవసాయ మౌలిక సదుపాయాల అభివృద్ధి, మత్స్యకారుల కోసం ప్రత్యేక పదవి ఇతరత్రా హామీలు పొందుపరిచారు.పేద ప్రజలకు ఈసారి మరింత పెద్దపీడ వేసినట్టుగా బిజెపి పార్టీ కనిపిస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: