ఆంధ్రప్రదేశ్లోని ఎన్నికల సైతం రేపటి రోజున జరుగుతూ ఉండడంతో నిన్నటి రోజున సాయంత్రం  ప్రచారం కూడా బంద్ చేయడం జరిగింది.. దీంతో కేవలం ఈరోజు ఒక్కరోజు మాత్రమే గ్యాప్ కలదు.. ఇప్పటికే చాలామంది నేతలు తమ నియోజకవర్గాలలో కూడా ప్రజలకు డబ్బు పంచడం జరిగింది.. అయితే ఈ డబ్బు పంపిన విషయంలో కూడా విచిత్రమైన సంఘటనలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. పబ్లిక్ కి డబ్బులు పంచడం కోసం పార్టీలు కొన్ని డైరెక్ట్ గా పంపించాయి..



ఎంపీ కాండేట్లు కూడా మరి కొంతమంది డబ్బులను ఇచ్చినట్లు తెలుస్తోంది. మరి కొంతమంది ఎమ్మెల్యేలు తమ ఆస్తులను తాకట్టు పెట్టి మరి ప్రజలకు డబ్బు పంచుతున్నారు. గ్రౌండ్ లెవెల్ లోకి పంపించినప్పుడు ఇప్పుడు వినపడుతున్నటువంటి మాట ఏమిటంటే.. వైసీపీ కానీ టిడిపి పార్టీ కానీ ఒక్కో ఓటుకు 2000 పంచాలనుకున్నారట.. చాలా చోట్ల కూడా ఇదే జరుగుతోంది. అయితే కొంతమంది మాత్రం ఓటుకు వెయ్యి రూపాయలు మాత్రమే ఇస్తున్నారట. అయితే ఇలా జరగడానికి ముఖ్య కారణం ఏమిటంటే స్థానిక నాయకులు తమకు ఇన్ని రోజులు ఖర్చయింది కదా అంటూ.. అందులో కొంత మొత్తాన్ని అక్కడి నేతలే పంచుకుంటున్నారు.



అందుకే 2000 రూపాయలు పెంచాల్సిన చోటు 1000 రూపాయలు లేదా 1500 రూపాయలు మాత్రమే పంచుతున్నారు. కొన్ని చోట్ల ఏమో 2000 ఇస్తున్నారు.. అయితే 1,50,000 మందికి ఇస్తామనుకుంటే.. కేవలం 1,20,000 మందికి మాత్రమే ఇస్తున్నారట. పార్టీ నాయకులు కూడా ఇలాంటి విషయాలను ఎప్పటికప్పుడు మానిటర్ చేస్తూనే ఉంటారు. డబ్బులు మాత్రం కరెక్ట్ గా ఇచ్చేయండి.. ప్రతి గంటకి ఇన్ఫర్మేషన్ మొత్తం నాయకుల దగ్గరకు పంపించాల్సి ఉన్నదట.. ఎంతమందికి ఇచ్చారు ఎన్ని నియోజకవర్గాలకు ఇచ్చారనే విషయాన్ని తెలియజేయాల్సి ఉంటుంది. పోలింగ్ రోజున ఎలక్షన్ కమిషన్ లెక్కల కంటే.. ఈ డబ్బుల పంపిణీ లెక్కలే ఎక్కువగా వినిపిస్తున్నాయి. రేపు రాత్రి తెల్లారే వరకు ఈ లెక్కలే వినిపిస్తూ ఉంటాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

AP