ఇండియన్ ఆర్మీ చేపట్టినటువంటి ఆపరేషన్ సింధూర్ ఎఫెక్ట్ వల్ల పాకిస్తాన్ చాలా తీవ్రమైన సంక్షేభంలో పడిపోయింది. ముఖ్యంగా ఉగ్రవాదుల స్థావరాలపైన దాడిని సహించలేకపోవడంతో దొంగ చాటు దెబ్బలు కొట్టాలని ఎన్నో రకాల ప్రయత్నాలు చేసిన వాటిని కూడా తిప్పి కొట్టింది ఇండియన్ ఆర్మీ. సాధారణ పౌరుల పైన కూడా దాడిని ఉపక్రమించింది. ప్రస్తుతం పాకిస్తాన్ ఆర్థిక పరిస్థితి చాలా దారుణంగా మారిపోయిందట. భారత్ పైన దుర్మార్గపు దాడులకు పాల్పడుతూ మరింత కిందికి దిగజారి పరిస్థితి ఇప్పుడు ఏర్పడింది. అయితే ఇప్పుడు వీటన్నిటి నుంచి కూడా బయటపడేందుకు పాకిస్తాన్ అంతర్జాతీయ సంస్థల నుంచి రుణాలు కోసం ప్రాకులాడుతోందట.


తమకు ఆర్థికంగా సహాయం చేయాలంటు సోషల్ మీడియా వేదికగా కొన్ని పోస్టులను షేర్ చేస్తోందట పాకిస్తాన్. ఇందులో భారత్ పైన అక్కస్సును తెలియజేస్తూ నెట్టింట విపరీతమైన విమర్శలు కూడా చేసేలా చేస్తున్నారు. దీంతో పాకిస్తాన్ తమ రుణాల కోసం ఏ పోస్టుని అసలు చేయలేదని తమ హెక్స్ ఖాతా హ్యాక్ అయిందంటూ పాకిస్తాన్ ప్రభుత్వం ప్రకటించింది.. అయితే ఈ విషయాన్ని సమర్థించుకునేందుకు పాకిస్తాన్ ఇలా చెక్ చేసుకున్నట్లు ఒక పోస్ట్ చేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి.


పాకిస్తాన్ కు అంతర్జాతీయ సంస్థల నుంచి ఎలాంటి రుణాలు రాకుండా ఉండేందుకు భారత్ చాలా తీవ్రంగా ప్రయత్నాలు చేస్తోందనే విధంగా కథనాలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే భారత్ విధానం ఏంటో విదేశీ కార్యదర్శి అయిన విక్రమ్ మిస్త్రీ క్లారిటీ ఇవ్వడం జరిగింది. అంతర్జాతీయ మానిటరీ ఫండ్ తో భేటీ అయిన నేపథ్యంలో పాకిస్తాన్ ఈ పోస్టులు చేసినట్లు  బయటపడ్డాయి.యుద్ధ వాతావరణంలో ఇప్పటికే పాకిస్తాన్ స్టాక్ మార్కెట్ కూడా ఒక్కసారిగా కుప్పకూలిపోయిందట. ఇక కేవలం యాచించేందుకే ఇది ఒక్క మార్గం ఉన్నదంటూ పాకిస్తాన్ ఇలా పోస్ట్ చేసిందనే విధంగా టోల్స్ చేస్తూ ఉన్నారు. మొత్తానికి డైరెక్ట్ గా అడగకుండా ఇలా సోషల్ మీడియాలో పోస్టుల ద్వారా అడుగుతున్నట్లు వినిపిస్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: