గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీని హుటాహుటిన జైలు నుంచి ఆస్పత్రికి తరలించారుు .. శ్వాస తీసుకోవటంలో ఆయన ఇబ్బందులు పడ్డారు జైల్లో శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడుతున్నామని న్యాయాధికారికి  వంశీ తెలిపారు ఆక్సిజన్ అనలైజర్ పెట్టుకోవడం వల్ల ముక్కు వద్ద ఉన్న ఎముకలు నొప్పి వస్తున్నాయని కూడా చెప్పారు .. అలాగే రాత్రి సమయంలో నిద్రపట్టేటప్పుడు పల్స్ రేట్ ఒకసారిగా తగ్గిపోతుందని కూడా చెప్పకచ్చారు .. అలాగే డాక్టర్లు రాసిన మందులు కూడా జైలు అధికారులు వేరే మందులు ఇస్తున్నారని కూడా వంశీ తరపు న్యాయవాది సత్య శ్రీ కోర్టు దృష్టికి కూడా తీసుకువెళ్లారు .. దీంతో  వంశీని ప్రభుత్వ ఆసుపత్రిలో గాని ప్రభుత్వ గుర్తింపు ఉన్న ఆసుపత్రిలో గానీ వైద్యం చేయించాలనే ఆదేశాలతో న్యాయమూర్తి ఉత్పరులు జారీ చేశారు .


ఇక దీంతో వంశీని వెంటనే స్థానిక ప్రభుత్వ హాస్పటల్‌కు తరలించారు .  వంశికి ప్రస్తుతం వైద్యం అందిస్తున్నారు. ఈ విషయం బయటకు రావడంతో ఆసుపత్రి వద్దకు వైసిపి వర్గాలు భారీగా చేరుకున్నారు .  అలాగే వంశీ ఆరోగ్యం పై ఆరా తీస్తున్నారు .. కాగ‌ గన్నవరం కు చెందిన సత్యవర్థన్ కిడ్నాప్ కేసులో ఆయనకు బెయిల్ మంజూరైన విషయం తెలిసిందే .. అయితే గన్నవరం టిడిపి కార్యాలయం పై దాడి చేసిన కేసులో మాత్రం ఆయన రిమాండ్ ఖైదీ గానే ఉన్నారు .. ఇక దీంతో ఇంకా జైల్లోనే వల్లభనేని వంశీ ఉన్నారు .. ఇక ఈ సమయంలో వల్లభనేని వంశీ అస్వస్థతకు గురికావడంతో వైసీపీ నేతలో గందరగోళం మొదలైంది .



కోర్టు ఇచ్చిన ఆదేశాలతో జైలు అధికారులు వంశీని గత సాయంత్రం విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రకు తీసుకువెళ్లారు మొదటి అంతస్తులో ఉన్న రెసిడెన్షియల్ మెడికల్ ఆఫీసర్ ఛాంబర్ లో వైద్యులు వంశీ రక్త నమోనాలను తీసుకున్నారు బీపీ,  షుగర్,  ఈసీజీ, సిటీ స్కాన్ పరీక్షలు కూడా చేశారు .. ఆయనకు ఎక్కువగా పొడి దగ్గు వస్తున్నట్లు కూడా గుర్తించారు .. అయితే సత్యవర్థన్‌ కిడ్నాప్ కేసులో వావల్లభనేని వంశీ తో పాటు మ‌రో ఐదుగురికి ఏసీబీ కోర్టు బెయిల్ మంజూరు చేసింది .. అయితే గన్నవరం టిడిపి కార్యాలయం పై దాడి కేసులో మాత్రం ఇంకా ఆయనకు బెయిల్  రాకపోవడంతో వంశీ ఇంకా జైల్లోనే ఉంటున్నారు .

మరింత సమాచారం తెలుసుకోండి: