మాజీ సీఎం వైఎస్ జగన్ అధికారంలో ఉన్న సమయంలో కొన్ని మంచి పనులను చేసిన ఆ మంచి పనులను చెప్పుకునే విషయంలో ప్రచారం చేసుకునే విషయంలో ఫెయిల్ అయ్యారనే సంగతి తెలిసిందే. అయితే జగన్ చేసిన గొప్ప పనులు ఇప్పుడు వెలుగులోకి వస్తున్నాయి. హైదరాబాద్ అభివృద్ధికి చంద్రబాబు నాయుడు కారణమని చాలామంది విశ్వసిస్తారనే సంగతి తెలిసిందే. చంద్రబాబు సైతం ఈ విషయాలను పలు సందర్భాల్లో చెప్పుకొచ్చారు.

"కరువు సీమకు పచ్చని తోరణాలు" అంటూ టీడీపీ అనుకూల పత్రికలో తాజాగా ఒక కథనం ప్రచురితమైన సంగతి  తెలిసిందే.  ఉమ్మడి  అనంతపురం  జిల్లా దేశంలో  అత్యంత కరువు జిల్లాలలో ఒకటి కాగా   కొన్నేళ్ల నుంచి కేంద్ర  రాష్ట్ర ప్రభుత్వాలు  ఈ జిల్లాలో  బిందు సేద్యాన్ని ప్రోత్సహిస్తున్నాయి.    హంద్రీ నీవా ప్రాజెక్ట్ వల్ల అనంతపురం సస్యశ్యామలంగా మారుతోంది.  ఎస్కెయూలో మియావాకి దిశగా అడుగులు వేయడంతో జిల్లాలో మరింత  పచ్చదనం పెరిగే అవకాశాలు అయితే ఉన్నాయి .

తక్కువ స్థలంలో  ఎక్కువ మొక్కలను అడవులలా పెంచే జపాన్ పద్దతిని  మియావాకి అని అంటారు.  ఈ విధానం  ద్వారా మొక్కలు వేగంగా  పెరిగే ఛాన్స్ అయితే ఉంటుంది. 2019 నవంబర్ లో  ఏపీ గ్రీనరీ  అండ్ బ్యూటిఫికేషన్  కార్పొరేషన్ ఎస్కెయూలోని బొటానికల్ గార్డెన్ లో  పరిశోధనలు చేపట్టారు.  మొత్తం 152 జాతుల మొక్కలు కాగా  జగన్ సర్కార్  హయాంలో ఈ పనులు జరిగాయి కాబట్టి  జగన్ ఒకింత గొప్ప పని చేశారని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.

అయితే  ఈ క్రెడిట్ జగన్ కంటే  ఎక్కువగా ఈ దిశగా అడుగులు వేసిన శాస్త్రవేత్తకు చెందుతుంది.  ఎస్కెయూ  వృక్ష శాస్త్ర విభాగాధిపతి  రవిప్రసాదరావు ఈ పరిశోధనలకు సారథ్యం వహించారు.  ఎకరాను 12 సెక్టార్లుగా విభజించి  ఒక్కో సెక్టార్ లో 128 చొప్పున మొక్కలు నాటారు.  మొక్కల మధ్య గ్యాప్ ఎక్కువగా ఉంచడంతో పాటు  స్థానిక జాతులను  ఎక్కువగా పెంచడం వాళ్ళ సత్ఫలితాలు వస్తాయని వెల్లడైంది.  

మరింత సమాచారం తెలుసుకోండి: