ఉమ్మడి ప్రకాశం జిల్లా నాయకులు అయిన క‌ర‌ణం బలరాం, శిద్దా రాఘ‌వ‌రావు ఇద్ద‌రూ కూడా తెలుగుదేశం నుంచి బ‌య‌ట‌కు పోతూ పోతూ, వాళ్ల వారసుల రాజకీయ జీవితాలను కూడా నాశనం చేశారనే చ‌ర్చ‌లు ఇప్పుడు జిల్లా రాజ‌కీయ వ‌ర్గాల్లో గ‌ట్టిగా వినిపిస్తున్నాయి. 2014లో ఉమ్మ‌డి రాష్ట్ర విభ‌జ‌న త‌ర్వాత తెలుగుదేశం విజ‌యం సాధించింది. ద‌ర్శి లో ఎమ్మెల్యేగా తొలిసారి గెలిచిన శిద్ధా రాఘ‌వ‌రావుకు చంద్ర‌బాబు త‌న కేబినెట్లో ఐదేళ్ల పాటు కీల‌క‌మైన మంత్రి ప‌ద‌వులు క‌ట్ట‌బెట్టారు. ఆ త‌ర్వాత 2019 ఎన్నిక‌ల‌కు వ‌చ్చే స‌రికి ఆయ‌న‌కు ఒంగోలు ఎంపీ సీటు ఇచ్చారు. ఎన్నిక‌ల్లో ఓడిపోయారు. ఇక క‌ర‌ణం బ‌ల‌రాం 2014 లో త‌న సీటు త్యాగం చేసి త‌న వార‌సుడు క‌ర‌ణం వెంక‌టేష్ కు ఒంగోలు సీటు ఇప్పించారు. అక్క‌డ వెంక‌టేష్ ఓడిపోయారు. త‌ర్వాత బ‌ల‌రాంకు ఎమ్మెల్సీ ఇచ్చారు. క‌ట్ చేస్తే 2024 ఎన్నిక‌ల్లో మ‌ధ్య మార్గంగా బ‌ల‌రాంను చీరాల‌కు పంపారు.


ఆ ఎన్నిక‌ల్లో బ‌ల‌రాం ఎమ్మెల్యేగా గెలిస్తే పార్టీ ఓడిపోయింది. దీంతో బ‌ల‌రాం వైసీపీ కండువా క‌ప్పుకున్నారు. 2019 త‌ర్వాత రాష్ట్రంలో తెలుగుదేశం ఓడిపోగానే బ‌ల‌రాం, శిద్ధా ఇద్ద‌రూ వైసీపీ కండువా లు క‌ప్పేసుకున్నారు. క‌ట్ చేస్తే ఇప్పుడు వారి రాజ‌కీయం ముగిసింది. కానీ వారి వార‌సులు రాజ‌కీయ భ‌విష్య‌త్తును బ‌లి ప‌శువును చేసిన‌ట్ల‌య్యింది.
కరణం వెంకటేష్, శిద్ధా సుధీర్ బాబు ఇద్ద‌రూ కూడా పార్టీ యువ‌నేత నారా లోకేష్ కి అత్యంత సన్నిహితంగా మెలిగిన నేతలుగా గుర్తింపు పొందారు. అటువంటి అనుబంధాన్ని వదిలేసి వైసీపీలో చేరారు.


వీరు వైసీపీలో చేరినా 2019 త‌ర్వాత ఎలాంటి ప్రాధాన్యం లేదు. ఇక శిద్దా రాఘవరావు కి అత్యంత ప్రాధాన్యం కలిగిన మంత్రిత్వ శాఖలను 2014-2019 మధ్య బాబు గారు ఇచ్చారు. టిడిపిలో పాలిటిబ్యూరో సభ్యుడిగా ఎంతో గౌరవం పొందారు. కానీ పార్టీకి కేవలం 23 సీట్లు వచ్చిన వెంటనే, ఇక భవిష్యత్తులో టిడిపి గెలవదన్నట్టు పార్టీని వదిలేశారు. అయినా వీరి అదృష్టం బాగుండి, 2024 దర్శి ఎమ్మెల్యే టికెట్‌ను బాబు గారు ఆఫర్ చేశారు. కానీ దాన్ని చేజేతులా శిద్దా సుధీర్ ఓ సెఫాల‌జిస్ట్ మాయ‌లో ప‌డి చేజేతులా త‌న రాజ‌కీయ భ‌విష్య‌త్తు నాశ‌నం చేసుకున్న‌ట్టు టాక్ ? ఇక ఇప్పుడేమో ఎప్పుడెప్పుడు టిడిపిలోకి తిరిగి వెళ్లాలా అని తహతహలాడుతున్నారట‌. ఏదేమైనా క‌ర‌ణం, శిద్ధాలు వేసిన పొలిటిక‌ల్ రాంగ్ స్టెప్పుల‌తో వారి వార‌సుల కెరీర్ ఇబ్బందుల్లో ప‌డింది.

మరింత సమాచారం తెలుసుకోండి: