బీహార్ రాష్ట్రం మరోసారి రాజకీయ ఉత్సాహంతో ఉప్పొంగిపోతోంది. అసెంబ్లీ ఎన్నికల హడావిడి రాష్ట్రవ్యాప్తంగా మొదలైపోయింది. ప్రధాన రాజకీయ పార్టీలు ఇప్పటికే ప్రచార రంగంలోకి దిగి, ప్రజల మద్దతు కోసం తీవ్రంగా శ్రమిస్తున్నాయి. అధికారంలోకి వస్తే ప్రజలకు ఏం చేయబోతున్నామో, ఎలాంటి సంక్షేమ కార్యక్రమాలు చేపడతామో అనే విషయాల్లో పక్కా ప్రణాళికలతో ప్రతి పార్టీ ముందుకు వెళ్తోంది. ఇక ఎన్నికల నిర్వహణ కోసం కేంద్ర ఎన్నికల సంఘం కూడా అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తోంది. ఈ ఎన్నికల వాతావరణంలో తాజాగా వెలువడిన ఒక నివేదిక బీహార్ రాజకీయాలను కుదిపేస్తోంది.


ఏడీఆర్ నివేదికలో సంచలన విషయాలు:

అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ సంస్థ బీహార్ రాష్ట్రంలోని సిట్టింగ్ ఎమ్మెల్యేల ఆస్తుల వివరాలపై సమగ్ర నివేదికను విడుదల చేసింది. ఈ నివేదిక ప్రకారం, మొత్తం 2004 మంది సిట్టింగ్ ఎమ్మెల్యేల్లో 194 మంది కోటీశ్వరులుగా ఉన్నారని వెల్లడించింది. ఈ వివరాలు బీహార్ ప్రజల్లో పెద్ద చర్చకు దారి తీసాయి. జనాలు తమ అభిమాన ఎమ్మెల్యేలు ఇంత భారీ ఆస్తులు కలిగి ఉన్నారని తెలుసుకుని ఆశ్చర్యపోతున్నారు. చాలా మంది ప్రజలు సోషల్ మీడియాలో "మనం ఎంతో ఇష్టంగా చూసే ప్రజాప్రతినిధులు ఇంత ఆస్తి కలిగి ఉన్నారా?" అంటూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.



అత్యంత సంపన్న ఎమ్మెల్యే నీలం దేవి:

ఈ నివేదికలో జేడీయూ పార్టీకి చెందిన ఎమ్మెల్యే నీలం దేవి అత్యంత సంపన్నురాలిగా నిలిచారు. ఆమె దగ్గర మొత్తం ₹80 కోట్ల ఆస్తులు ఉన్నాయని నివేదిక స్పష్టం చేసింది. దీంతో ఒక్కసారిగా బీహార్ రాజకీయాల్లో నీలం దేవి పేరు హాట్ టాపిక్‌గా మారింది.ప్రజలు సోషల్ మీడియాలో ఆమె పేరు గురించి విస్తృతంగా చర్చిస్తున్నారు. “ఇంత భారీ ఆస్తులు ఎలా సంపాదించింది? ఈ మొత్తం ఎక్కడి నుండి వచ్చింది?” అనే ప్రశ్నలు వరుసగా ఎదురవుతున్నాయి.



నిరుపేద ఎమ్మెల్యే రామ్ వృక్ష సదా:

ఇక మరోవైపు, ఆర్జేడీ పార్టీకి చెందిన ఎమ్మెల్యే రామ్ వృక్ష సదా మాత్రం బీహార్‌లో అత్యంత తక్కువ ఆస్తులు కలిగిన ఎమ్మెల్యేగా గుర్తింపబడ్డారు. ఆయన దగ్గర ఉన్న మొత్తం ఆస్తి విలువ కేవలం ₹70,000 మాత్రమే అని నివేదిక పేర్కొంది. దీనితో ఆయన నిజమైన ప్రజాప్రతినిధి అని కొంతమంది ప్రశంసిస్తుండగా, కొందరు మాత్రం నివేదిక ఖచ్చితత్వంపై సందేహం వ్యక్తం చేస్తున్నారు. అయితే, ఈ ఏడీఆర్ నివేదికపై కూడా కొంతమంది విమర్శకులు సందేహం వ్యక్తం చేస్తున్నారు. “ఏ రాజకీయ నాయకుడు తన పూర్తి ఆస్తులను అధికారికంగా ప్రకటించడు. తప్పనిసరిగా కొంత లోటుపాట్లు చూపిస్తారు” అని వారు అంటున్నారు.



అయినప్పటికీ, నీలం దేవి పేరు 80 కోట్ల ఆస్తులతో టాప్ లిస్ట్‌లో ఉండటం బీహార్ రాజకీయాల్లో పెద్ద సంచలనంగా మారింది. సోషల్ మీడియాలో ఆమె పేరు విస్తృతంగా వైరల్ అవుతోంది. ఎన్నికల వాతావరణంలో ఈ నివేదిక వెలువడడంతో రాజకీయ నాయకులు, ప్రజలు, మీడియా అందరూ దీన్ని ప్రధాన చర్చావిషయంగా మార్చుకున్నారు. మొత్తం మీద, బీహార్‌లో ఎన్నికల వేడి మొదలైన తరుణంలో వెలుగులోకి వచ్చిన ఈ ఏడీఆర్ నివేదిక రాజకీయ వాతావరణాన్ని మరింత రగిలించింది. ఒకవైపు ప్రజల ఆశలు, మరోవైపు నేతల ఆస్తులు — ఈ రెండూ ఇప్పుడు ఎన్నికల హడావిడిలో ప్రధాన చర్చగా మారాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: