ఈ ఘటన తర్వాత చిన్న స్వామి స్టేడియంలో కూడా ఎటువంటి మ్యాచులు జరగలేదు. ముఖ్యంగా అ స్టేడియంలో మ్యాచ్లను నిర్వహించడానికి ఇప్పటివరకు ఎలాంటి గ్రీన్ సిగ్నల్ కూడా రాలేదట. అంతేకాకుండా వచ్చే ఏడాది జరిగే T -20 ప్రపంచ కప్ వేదికల జాబితాలో కూడా చిన్నస్వామి స్టేడియాన్ని ఎంపిక చేయలేదని వినిపిస్తున్నాయి. దీంతో ఆర్సిబి 2026 లో ఐపీఎల్ హోమ్ మ్యాచులను చిన్నస్వామి స్టేడియంలో ఆడే అవకాశాలు ఎక్కువగా కనిపించలేదు. RCB మ్యాచ్లను మహారాష్ట్రలోని పూణేలో స్టేడియంలో ఆడేందుకు ఎక్కువగా అవకాశాలు ఉన్నాయని క్రీడా నిపుణులు తెలియజేస్తున్నారు.
ఇందుకు గల కారణం బెంగళూరులో జరిగిన తొక్కిసలాట ఫలితమే అన్నట్లుగా నిపుణులు తెలియజేస్తున్నారు. ఒకవేళ ఇదే కనుక జరిగితే RCB తమ మ్యాచ్లను హోమ్ గ్రౌండ్ లో ఆడక పోవడం కూడా ఇదే మొట్టమొదటిసారి అవుతుంది. ఇది అభిమానులకు టీమ్ కి కూడా చాలా నిరాశే కలిగిస్తోంది. అంతేకాకుండా మహారాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ కార్యదర్శి అయిన కమలేష్ పిసాల్ ఇలా మాట్లాడుతూ.. పూణేలో ఆర్సిబి మ్యాచ్లను నిర్వహించడం పైన ఇంకా చర్చలు జరుగుతున్నాయని, మేమైతే మా స్టేడియాన్ని వారికి ఇవ్వడానికి సిద్ధంగానే ఉన్నామని తెలిపారు. మరి ఏంటన్నది మరొక కొద్ది రోజులలో తేలుతుందట.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి