( గ్రేట‌ర్ హైద‌రాబాద్ - ఇండియా హెరాల్డ్ ) . . .

తెలంగాణ రాజ‌ధాని గ్రేట‌ర్ హైద‌రాబాద్ లోని జూబ్లిహిల్స్ అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గానికి జ‌రుగుతున్న ఉప ఎన్నిక‌ల ఓట్ల లెక్కింపు ప్రారంభ‌మైంది. మూడు ప్ర‌ధాన పార్టీల‌కు చెందిన అభ్య‌ర్థుల‌తో పాటు మొత్తం 58 మంది అభ్య‌ర్థులు పోటీలో ఉన్నారు. కాంగ్రెస్ నుంచి న‌వీన్ యాద‌వ్‌, బీఆర్ఎస్ నుంచి దివంగ‌త మాజీ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ స‌తీమ‌ణి మాగంటి సునీత , బీజేపీ నుంచి గ‌త అసెంబ్లీ ఎన్నిక‌ల్లో ఓడిపోయిన లంకాల దీప‌క్ రెడ్డి పోటీ చేస్తున్నారు. ఎంత మంది పోటీలో ఉన్నా కూడా ముందు నుంచి ప్ర‌ధాన పోటీ మాత్రం బీఆర్ ఎస్ వ‌ర్సెస్ కాంగ్రెస్ మ‌ధ్యే ఉంది. ఇంకా చెప్పాలంటే బీఆర్ ఎస్ వ‌ర్సెస్ కాంగ్రెస్ అనేక‌న్నా కాంగ్రెస్ నుంచి ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి వ‌ర్సెస్ బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మ‌ధ్యే హోరాహోరీగా కొన‌సాగుతోంది.


ఇక ఈ ఉప ఎన్నిక‌ల్లో సీమాంధ్రుల ఓట్లు ఎటు వైపు ప‌డ‌తాయి అన్న‌ది ముందు నుంచి ఉత్కంఠ‌గా ఉంది. అయితే ఓట్ల లెక్కింపు ప్రారంభ‌య్యాక తొలి రౌండ్ షేక్ పేట‌లో బీఆర్ ఎస్ కాంగ్రెస్ మ‌ధ్య తీవ్ర‌మైన పోటీ నెల‌కొంది. కాంగ్రెస్‌కు కేవ‌లం 62 ఓట్ల మెజార్టీ మాత్ర‌మే వ‌చ్చింది. రెండో రౌండ్లోనూ కాంగ్రెస్‌కు వెయ్యి ఓట్ల మెజార్టీ వ‌చ్చింది. ఇక సీమాంధ్ర .. టీడీపీ అభిమానులు ఓట్లు ఎక్కువుగా ఉండే వెంగ‌ళ‌రావు న‌గ‌ర్ డివిజ‌న్లో మాత్రం కాంగ్రెస్‌కు 2 వేల ఓట్ల మెజార్టీ వ‌చ్చింది. లేటెస్ట్ అప్‌డేట్ ప్ర‌కారం మూడు రౌండ్లు ముగిసే స‌రికి కాంగ్రెస్ అభ్య‌ర్థి న‌వీన్ యాద‌వ్‌కు 3 వేల ఓట్ల మెజార్టీ వ‌చ్చింది. ఏదేమైనా ప్రాథ‌మిక అంచ‌నా ప్ర‌కారం సీమాంధ్ర ఓట‌ర్లు ఎక్కువుగా ఉన్న చోట కాంగ్రెస్‌కు ఓటింగ్ ప‌డిన‌ట్టు తెలుస్తోంది.


వాట్సాప్ నెంబ‌ర్‌కు మీ జిల్లాలో రాజ‌కీయ‌, సామాజిక స‌మ‌స్య‌లు వివ‌రాలు పంపండి..

ఏపీ, తెలంగాణ‌లో వివిధ నియోజ‌క‌వ‌ర్గాల్లో నెల‌కొన్న ప్ర‌జ‌ల స‌మ‌స్య‌లు, రాజ‌కీయ ప‌ర‌మైన అంశాల‌ను మా దృష్టికి తీసుకు రావాల‌నుకుంటున్నారా ?  మీ స‌మ‌స్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబ‌రుకు వాట్సాప్ ద్వారా తెలియ‌జేయండి.

నోట్ :  వ్య‌క్తిగ‌త స‌మ‌స్య‌లు వ‌ద్దు.

మరింత సమాచారం తెలుసుకోండి: