చాలామందికి ఎంత కష్టపడి పనిచేసినా వారి శ్రామకు తగ్గ ఫలితం రాక చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు.ఏ పని పట్టుకున్న అపజయం ఎదురవుతూ ఉంటుంది. అలాంటి వారికి మన హిందూశాస్త్రం ప్రకారం కొన్ని వస్తువులను నీటిలో వేసి,ఆ నీటితో తల స్నానం చేయడం వల్ల ఎటువంటి దోషాలు ఉన్నా తొలగి,వారి పనులు సజావుగా జరగడమే కాకుండా వారి ఆర్థిక ప్రగతికి కూడా దోహదపడుతుంది.ఇంకా చెప్పాలి అంటే ఉద్యోగ సమస్యలు,దృష్టి దోషాలు వంటి వాటికి కూడా విరుగుడు కలుగుతుంది.నీటిలో ఎలాంటి వస్తువులు కలపాలో,వాటితో స్నానం చేయడం వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటో తెలుసుకుందాం..

పసుపు..
హిందూ సాంప్రదాయంలో పసుపుకు ప్రత్యేక స్థానం ఉంది.మరియు ఇది సాంకేతికంగా క్రిమిసంహారిణిగా కూడా వాడుతారు.ఏ పని పట్టుకున్న జరగక ఇబ్బంది పడేవారు,పసుపు కలిపిన నీటితో స్నానం చేయడం వల్ల, వారి మైండ్ లోని నెగిటివ్ ఎనర్జీ వెళ్ళిపోయి,పాజిటివ్ గా ఆలోచించి,వెళ్లిన పని నెరవేర్చుకొని వస్తారు. మరియు ఇంట్లోని అశాంతి కూడా  తగ్గిపోతుంది.

గంధం..
జ్యోతిష్య శాస్త్రం ప్రకారం చందనం విజయం, సంపద మరియు కీర్తిని కలిగించేందుకు ఉపయోగపడుతుంది. చిటికెడు గంధపు పొడిని స్నానం చేసే నీటిలో కలుపుకొని,స్నానం చేయడం వల్ల మనసు ప్రశాంతంగా ఉంటుంది.మరియు ఒత్తిడిని తగ్గించి,సానుకూల శక్తిని పెంచుతుంది.గంధానికి శరీరాన్ని చల్లబరిచే గుణం ఉంటుంది కూడా.

వేపపువ్వు..
వేప పువ్వులో యాంటీ బాక్టీరియల్ మరియు క్రిమినాశక లక్షణాలకు పుష్కళంగా ఉన్నాయి.భారతీయ సంప్రదాయంలో వేపపువ్వుకు శరీరం నుండి ప్రతికూల శక్తిని తొలగిస్తుందని నమ్మకం గట్టిగా ఉంది.మనం స్నానం చేసే నీటిలో,గుప్పెడు వేప పువ్వు వేసి, తలస్నానం చేయడంతో శుభం కలుగుతుంది.

తులసి..
తులసికి హిందూ సంప్రదాయంలో ఒక పవిత్రమైన స్థానం ఉంది. మరియు ఇది ఆయుర్వేదంలో కూడా చాలా బాగా ఉపయోగపడుతుంది.జ్యోతిషశాస్త్రంలో, తులసి మొక్క విజయం మరియు శ్రేయస్సును చేకూరుస్తుంది.

దర్భలు..
ప్రతి గురువారం నీటిలో కొంత దర్బారసంను,స్నానం చేసే నీటిలో కలిపి స్నానం చేయడం వల్ల,అదృష్టం మరియు ఉద్యోగప్రయత్నాలు ఫలిస్తాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: