ఊహించినట్లుగానే ఇటీవల
శ్రీలంక తో జరిగిన మూడో టీ 20 లో నిరాశ పరిచిన
కేరళ వికెట్ కీపర్
సంజు శాంసన్ కు సెలక్టర్లు షాక్ ఇచ్చారు.
న్యూజిలాండ్ తో టీ 20 సిరీస్ కు కొద్దీ సేపటి క్రితం సెలక్షన్ కమిటీ ,భారత జట్టును ప్రకటించింది. అందులో
సంజు శాంసన్ కు చోటు దక్కలేదు. సంజు తో పాటు ఆల్ రౌండర్
హార్దిక్ పాండ్య ను కూడా ఈ సిరీస్ కు ఎంపిక చేయలేదు. ఫిట్ నెస్ పరీక్షలో విఫలకావడంతో
హార్దిక్ ను పరిగణలోకి తీసుకోలేదు.
ఇక శ్రీలంక తో జరిగిన టీ 20 సిరీస్ నుండి విశ్రాంతి తీసుకున్న స్టార్ ఓపెనర్ రోహిత్ శర్మ , ఫాస్ట్ బౌలర్ షమీ మళ్ళీ జట్టులోకి వచ్చారు. 5మ్యాచ్ ల టీ 20 సిరీస్ లో భాగంగా ఇరు జట్ల మధ్య ఈనెల 24న ఆక్లాండ్ లో మొదటి టీ 20 మ్యాచ్ జరుగనుంది. కాగా ఈపర్యటనలో ఆతిథ్య జట్టుతో
భారత్ టీ 20 సిరీస్ తో పాటు మూడు మ్యాచ్ ల వన్డే సిరీస్, రెండు మ్యాచ్ ల టెస్ట్ సిరీస్ లో తలపడనుంది.
భారత జట్టు (టీ 20సిరీస్ ) :
విరాట్ కోహ్లీ (కెప్టెన్), రోహిత్ శర్మ ,రాహుల్ , ధావన్ , శ్రేయాస్ అయ్యర్ , రిషబ్ పంత్ , శివమ్ దూబే , మనీష్ పాండే , వాషింగ్టన్ సుందర్ , కుల్దీప్ యాదవ్ , చాహల్ ,సైనీ , బుమ్రా , శ్రద్ధుల్ ఠాకూర్ ,షమీ ,రవీంద్ర జడేజా