భారత్లో క్రికెట్కు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఒక్కసారి ప్రొఫెషనల్ క్రికెట్ లోకి అడుగుపెట్టిన తర్వాత ఆ క్రికెటర్ జీవితం మొత్తం మారిపోతుంది అని చెబుతూ ఉంటారు. ఇటీవలి కాలంలో మిడిల్ క్లాస్ నుంచి వచ్చిన ఎంతో మంది యువ క్రికెటర్లు ఒక్కసారి ఐపీఎల్ లో అవకాశం దక్కించుకున్నారు అంటే చాలు ఇక లగ్జరీ లైఫ్ గడిపే క్రికెటర్గా మారిపోతున్నారు. కానీ అందరి విషయంలో పరిస్థితి ఒకేలా ఉండదు అన్నది మాత్రం కొంతమంది విషయంలో నిరూపితం అవుతూ ఉంటుంది. నాణానికి ఒకవైపు మాత్రమే కాదు మరో వైపు కూడా క్రికెటర్లకు ఎవరూ ఊహించని కష్టాలు ఉంటాయి అన్నది కొంతమందిని చూస్తే అర్థమవుతుంది.

 ఇప్పుడు మనం మాట్లాడుకునే క్రికెటర్ కూడా ఆ కోవకు చెందిన వాడే. అతని పేరు రాజా బాబు ప్రస్తుతం ఘజియాబాద్లో ఈ రిక్షా నడుపుతూ పాలు అవుతున్నాడు. 2017 లో జాతీయ పోటీల్లో ఉత్తరప్రదేశ్ తరఫున ఢిల్లీ పై 20 బంతుల్లో 67 పరుగులు చేసి అందరి దృష్టిని తన వైపుకు తిప్పుకున్నాడు. మీరట్ లో జరిగిన హౌసా లోన్ కి ఊడన్ పోటీలో 50 పరుగులు చేసి ప్రశంసలు అందుకున్నాడు. జాతీయ జట్టులో స్థానం సంపాదించుకోవడం ఖాయం అని అందరూ అనుకున్నారు.


 ఈ క్రమంలోనే ఒక స్థానిక వ్యాపార వేత్త అతని ప్రతిభకు మెచ్చి ఏకంగా ఈ - రిక్షా బహుమతిగా ఇచ్చాడు. కానీ ఇప్పుడు అదే అతనికి జీవనోపాధిగా మారిపోయింది. ఘజియాబాద్ లో ప్రస్తుతం రిక్షా నడుపుతూ పాలు అమ్ముతూ జీవనం గడపాల్సిన పరిస్థితి ఏర్పడింది. కరోనా రాజబాబు కెరీర్ ని నాశనం చేసింది అని చెప్పాలి. కరోనా సంక్షోభం ముందు దివ్యాంగ్ క్రికెట్ అసోసియేషన్ రాష్ట్రంలోని వికలాంగ క్రికెటర్ కు సహాయం అందుతూ ఉండేది. కానీ కరోనా వైరస్ కారణంగా 2020లో కార్యకలాపాలను నిలిపి వేసింది. రాజబాబు లాంటి క్రికెటర్లు ఉనికి కోల్పోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. తనతో పాటు తన సహచరులు కూడా మీరట్ లోని వికలాంగుల దాబా లో డెలివరీ ఏజెంట్ లుగా పనిచేసేవారు అంటూ చెప్పుకొచ్చారు రాజబాబు. అతనికి భార్య నిది, పిల్లలు కృష్ణ, శాంతి ఉన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: