టీమిండియా మాజీ ఓపెనర్ గౌతమ్ గంభీర్ ఎప్పుడు సంచలన వ్యాఖ్యలతో అటు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారిపోతూనే ఉంటాడు అన్న విషయం తెలిసిందే. ఒకప్పుడు భారత జట్టులో కొనసాగిన సమయంలోనే కాదు ఇక అంతర్జాతీయ క్రికెట్ కెరీర్ కు రిటైర్మెంట్ ప్రకటించిన తర్వాత కూడా గౌతం గంభీర్ తన వ్యాఖ్యలతో ఎప్పుడు అందరిని ఆశ్చర్యపరుస్తూ ఉంటాడు. ఎప్పుడు మొక్కుసూటిగా మాట్లాడుతూ ఉంటాడు అని చెప్పాలి. ఈ క్రమంలోనే గాంధీ చేసే వ్యాఖ్యలు కొన్ని కొన్ని సార్లు అతని విమర్శలు పాలు కూడా చేస్తూ ఉంటాయని చెప్పాలి.


 సాధారణంగా జట్టులో కొనసాగుతున్న స్టార్ ఆటగాళ్లకు ఎక్కువ గుర్తింపు ఉంటుంది. ఇక మిగతా ఆటగాళ్లు బాగా రాణించిన వారి గురించి ప్రేక్షకులు మాత్రం పెద్దగా చర్చించుకోరు. ప్రస్తుతం భారత జట్టులో పరిస్థితి అలాగే ఉంది. కోహ్లీ , రోహిత్ శర్మలతో పోలిస్తే ప్రస్తుతం మిగతా ఆటగాళ్లు ప్రస్తుతం మంచి ఫామ్ లో ఉన్నారు. కానీ ప్రతి ఒక్కరు చర్చించుకుంటూ ఉంది మాత్రం అటు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ ల గురించి మాత్రమే అని చెప్పాలి. ఇటీవల ఇదే విషయంపై స్పందించిన గౌతమ్  షాకింగ్ కామెంట్స్ చేశాడు.


 2011 నుండి 2022 మధ్య టీమ్ ఇండియా ఐసీసీ ట్రోఫీలు గెలవక పోవడానికి కారణం ప్లేయర్లకు భజన చేయడమే అంటూ గౌతం తల్లి వ్యాఖ్యానించాడు. అయితే ఆ భజన జట్టుకు మేలు చేస్తే మంచిది అంటూ తెలిపాడు. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పదేపదే రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీల గురించి ప్రశ్నలు రావడంతో విసిగితే పోయాడు గౌతం గంభీర్. ఈ క్రమంలోనే షాకింగ్  కామెంట్స్ చేశాడు. కోహ్లీ, రోహిత్ భజన ఆపండి.. ప్రస్తుతం సూపర్ ఫామ్ లో ఉన్న సూర్య కుమార్ యాదవ్ గురించి ఎందుకు మాట్లాడటం లేదు అంటూ ప్రశ్నించాడు గౌతమ్ గంభీర్..

మరింత సమాచారం తెలుసుకోండి: