ఈ రోజు చట్టోగ్రామ్ వేదికగా ఇండియా మరియు బంగ్లాదేశ్ ల మధ్యన మొదటి టెస్ట్ స్టార్ట్ అయింది. మొదట టాస్ గెలిచిన ఇండియా కెప్టెన్ కె ఎల్ రాహుల్ ముందుగా బ్యాటింగ్ ఎంచుకున్నాడు. ఓపెనర్ లుగా రాహుల్ మరియు శుబ్మాన్ గిల్ లు వచ్చారు.. ఇప్పటికే వన్ డే సిరీస్ ను కోల్పోయిన బాధలో ఉన్న ఇండియాకు కనీసం టెస్ట్ సిరీస్ ను గెలుచుకుని సగర్వంగా స్వదేశానికి వెళ్లాలన్న కసితో ఉన్నారు. ఇక మొదటి టెస్ట్ కు ముందు కెప్టెన్ రాహుల్ చేసిన ప్రకటన చూసిన ఇండియా అభిమానులు ఈ మ్యాచ్ లో చెలరేగుతారని అనుకున్నారు. కానీ అనుకున్నది ఒకటి.. అయిందొకటి లాగా ఇండియా పరిస్థితి మారిపోయింది. కేవలం 41 పరుగుల వద్ద ఇండియా తమ మొదటి వికెట్ ను గిల్ (20) రూపంలో పోగొట్టుకుంది.

ఆ తర్వాత నాలుగు పరుగులు జత చేసి రాహుల్ (22) కూడా చేతులెత్తేశాడు, అలా కష్టాల్లో ఉన్న టీం ఇండియాను ఆదుకోవలసిన బాధ్యత అంతా కోహ్లీ మరియు పుజారాలపై పడింది. కానీ కోహ్లీ సైతం కేవలం ఒక్క పరుగు చేసి పెవిలియన్ చేరాడు. ఆ పరిస్థితుల్లో క్రీజులోకి వచ్చిన కీపర్ పంత్ బంగ్లా బౌలర్లపై విరుచుకుపడ్డాడు... వేగంగా ఆడి జట్టును ఆదుకోవాలని ప్రయత్నించిన పంత్ (46) కూడా అవుట్ అయ్యాడు. ఇక అప్పటి నుండి పుజారాతో జత కలిసిన శ్రేయాస్ అయ్యర్ జాగ్రత్తగా ఆడుతూ జట్టును సురక్షిత స్థితిలో నిలిపాడు. కానీ పుజారా 90 సెంచరీకి 10 పరుగుల దూరంలో నిలిచిపోయాడు. ఇక ఈ రోజు ఆట ముగిసే సమయానికి ఇండియా 6 వికెట్ల నష్టానికి 278 పరుగులు చేసింది. బంగ్లా బౌలర్లలో తైజుల్ ఇస్లాం 3 వికెట్లు మరియు మెహిదీ 2 వికెట్లు తీసుకున్నాడు.

క్రీజులో శ్రేయాస్ అయ్యర్ (82) ఒక్కడే ఉన్నాడు... జట్టులో కీలక సమయంలో చోటు దక్కించుకున్న శ్రేయాస్ అయ్యర్ ఆచితూచి ఆడుతూ అర్ధసెంచరీతో ఆకట్టుకున్నాడు. ఇండియా జట్టులో రాహుల్, కోహ్లీ, మరియు గిల్ లు ఫెయిల్ అయ్యారు. సెకండ్ ఇన్నింగ్స్ లోనూ ఇదే విధంగా ఆడితే మ్యాచ్ ను బంగ్లాకు అప్పగించాలసిందే. మరి చూద్దాం రేపు శ్రేయాస్ అయ్యర్ ఎంత వరకు మొదటి ఇన్నింగ్స్ స్కోర్ ను పెంచగలడో... ?  

మరింత సమాచారం తెలుసుకోండి: