వరుస మ్యాచ్‌లలో ఓటమి పాలైన ముంబై ఇండియన్స్.. గత కొన్ని మ్యాచ్‌ల్లో చాలా అద్భుతమైన విజయాలు సొంతం చేసుకుని, ప్లే ఆఫ్స్ రేసులోకి తిరిగి వచ్చేసింది.ఇక టీంలో తుఫాన్లా ఆడే బ్యాట్స్‌మెన్ సూర్యకుమార్ యాదవ్‌ తన అద్బుతమైన బ్యాటింగ్‌తో దూసుకపోతూ.. కీలక పాత్ర పోషిస్తున్నాడు. ఈ క్రమంలో ఈరోజు గుజరాత్ టైటాన్స్ సవాలు విసిరేందుకు సిద్ధమయ్యాడు. అయితే, తొలిసారి ఈ రెండు జట్ల మధ్య జరిగిన పోరులో సూర్య కుమార్ యాదవ్ విఫలమయ్యాడు. ఈరోజు లీగ్‌లో ఈ రెండు టీమ్స్ రెండో సారి ఢీకొట్టబోతున్నాయి. కానీ ఈసారి అతను విఫలమయ్యే అవకాశం లేదు. ఈసారి గుజరాత్‌పై అతని బ్యాట్ పనిచేయకపోతే ముంబై ఖచ్చితంగా కష్టాల్లో పడుతుంది. ఇంకా ఇది మాత్రమే కాదు, ముంబై టీం ప్లేఆఫ్ ఆశలు కూడా తగ్గిపోతాయి. ఇప్పటికే పాయింట్ల పట్టికలో గుజరాత్‌ ఫస్ట్ ప్లేస్ లో కొనసాగుతోంది. ఇలాంటి పరిస్థితిలో ముంబై ఇప్పుడు తన భవిష్యత్తును నిర్ణయించుకోవాల్సి వస్తుంది.


ముంబై టీంలో రోహిత్ శర్మ, ఇషాన్ కిషన్, సూర్యకుమార్ యాదవ్ ఇంకా కామెరాన్ గ్రీన్ వంటి బ్యాట్స్‌మెన్ ఉండగా, గుజరాత్‌లో మహమ్మద్ షమీ ఇంకా రషీద్ ఖాన్ వంటి బౌలర్లు ఉన్నారు. షమీ ఇంకా రషీద్‌లు తలో 19 వికెట్లు తీశారు. అయితే, 10 మ్యాచ్‌లలో మొత్తం 361 పరుగులు చేసిన సూర్య, ఈ ఇద్దరి కంటే కూడా రూ. 30 లక్షల బౌలర్ నుంచే ఎక్కువ ప్రమాదాన్ని ఎదుర్కొనే ఛాన్స్ ఉంది.రషీద్ ఖాన్ శిష్యుడు నూర్ అహ్మద్ సూర్యకు కష్టాలు సృష్టించేందుకు రెడీ అయ్యాడు. గతంలో జరిగిన మ్యాచ్ లో కూడా నూర్ అహ్మద్ ముందు సూర్య బ్యాట్ పనిచేయలేదు. ఈ సీజన్‌లో శుక్రవారం నాడు గుజరాత్‌, ముంబై టీమ్స్ రెండోసారి తలపడుతున్నాయి. ఫస్ట్ మ్యాచ్‌లో గుజరాత్ 55 పరుగుల తేడాతో విజయం సాధించింది. సూర్య కుమార్ యాదవ్ 23 పరుగులు మాత్రమే చేయగలిగాడు. ఆఫ్ఘన్ బౌలర్ నూర్ తన బౌలింగ్‌లోనే రివర్స్ క్యాచ్ ని పట్టగా… అతని ముందు సూర్యకుమార్ యాదవ్ చాలా కష్టపడుతున్నాడు. అప్పుడు నూర్ బౌలింగ్‌లో సూర్య ఒక్క బౌండరీ మాత్రమే కొట్టగలిగాడు.మరి చూడాలి ఈ రోజు జరగబోయే మ్యాచ్ లో ఏం జరుగుతుందో..

మరింత సమాచారం తెలుసుకోండి: